భీమవరంలో తొలిప్రేమ

ఈ మధ్య సినిమా ఫంక్షన్లకు సెకెండ్ కేటగిరీ పట్టణాలను ఎంచుకుంటున్నారు. ఎందుకంటే హైదరాబాద్ లో కన్నా సినిమా క్రేజ్ అక్కడ ఎక్కువ వుంటుంది కనుక. గతంలో హైదరాబాద్ కాకుంటే విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం అనేవారు.…

ఈ మధ్య సినిమా ఫంక్షన్లకు సెకెండ్ కేటగిరీ పట్టణాలను ఎంచుకుంటున్నారు. ఎందుకంటే హైదరాబాద్ లో కన్నా సినిమా క్రేజ్ అక్కడ ఎక్కువ వుంటుంది కనుక. గతంలో హైదరాబాద్ కాకుంటే విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం అనేవారు. కానీ ఇప్పుడు ఇంకా కిందకు వెళ్తున్నారు.

సాయి ధరమ్ తేజ్ తన ఇంటిలిజెంట్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం రాజమండ్రిని ఎంచుకున్నారు. ఈ నెల 4న అక్కడ ఫంక్షన్ జరుగుతుంది. అలాగే తన తొలి ప్రేమ సినిమా కోసం వరుణ్ తేజ్ భీమవరం పట్టణాన్ని వెన్యూగా ఎంచుకున్నారు. ఈ నెల 3న భీమవరంలో తొలి ప్రేమ ప్రీరిలీజ్ ఫంక్షన్ ను గ్రాండ్ గా చేయబోతున్నారు. టోటల్ యూనిట్ అక్కడకు తరలివెళ్తుంది.

దాంతో పాటే పనిలో పనిగా గుంటూరు, విశాఖల్లోని కాలేజీల్లో కూడా స్టూడెంట్ మీట్ లు నిర్వహిస్తారట. కొత్త దర్శకుడు వెంకీ అట్లూరి అందిస్తున్న ఈ సినిమాలో వరుణ్ సరసన రాశీఖన్నా నటిస్తోంది. బోగవిల్లి ప్రసాద్ నిర్మాత.