చిరంజీవి చైనా వెళ్లింది అందుకే.. వారంతా వెళ్లారా!

మెగాస్టార్ చిరంజీవి చైనా పర్యటనలో ఉన్నారనే సమాచారం అందుతోంది. దర్శకరత్న దాసరి నారాయణ  రావు మృతి నేపథ్యంలో చిరంజీవి సంతాపం కూడా అక్కడ నుంచే వెలువరింది. మరి ఇంతకీ మెగాస్టార్ చైనా పర్యటనకు ఎందుకు…

మెగాస్టార్ చిరంజీవి చైనా పర్యటనలో ఉన్నారనే సమాచారం అందుతోంది. దర్శకరత్న దాసరి నారాయణ  రావు మృతి నేపథ్యంలో చిరంజీవి సంతాపం కూడా అక్కడ నుంచే వెలువరింది. మరి ఇంతకీ మెగాస్టార్ చైనా పర్యటనకు ఎందుకు వెళ్లాడంటే.. దీని వెనుక ఆసక్తికరమైన కథే వినిపిస్తోంది. అదేమనగా.. ప్రతియేటా జరిగే దక్షిణాది ఎనలభైల హీరోహీరోయిన్ల సమావేశం కోసమే చిరు అక్కడకు వెళ్లినట్టుగా తెలుస్తోంది.

ఎనిమిదేళ్ల నుంచి ప్రతియేటా ఒక రోజున దక్షిణాది సీనియర్ నటనటీమణులు సమావేశం అవుతూ వస్తున్నారు. ఎనభైలలో, తొంభైల ప్రథమార్థం వరకూ ఒక వెలుగువెలిగిన హీరోలు, హీరోయిన్లతో పాటు చిరంజీవి, రజనీకాంత్, బాలయ్య వంటి వాళ్లంతా ఈ మీట్ కు హాజరవుతూ వస్తున్నారు.

అయితే ఇన్నాళ్లూ ఈ సమావేశాలు దక్షిణాదినే సాగాయి. చెన్నై, హైదరాబాద్, కొచ్చి వంటి నగరాల్లో ఈ తారలు సమావేశం అవుతూ వచ్చారు. అయితే ఈ సారి చైనాలో వీరు తమ మీటింగ్ ను పెట్టుకున్నారట. అందుకే ఈ సినీతారలు అంతా చైనా వెళ్లినట్టుగా తెలుస్తోంది. అందుకే మెగాస్టార్ తో పాటు ఈ మీటింగ్ కు వెళ్లిన వారంతా దాసరి అంత్యక్రియలకు మిస్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ ఏడాది వీరి సమావేశానికి కమల్ కూడా హాజరు కానున్నాడట.