నయనతారకి టాలీవుడ్‌ గుడ్‌ బై

'బాబు బంగారం' సినిమా తర్వాత నయనతార తెలుగు తెరపై కన్పించదా.? డబ్బింగ్‌ సినిమాల్లో మాత్రమే నయనతారని చూడాల్సి వస్తుందా.? టాలీవుడ్‌లో విన్పిస్తున్న గాసిప్స్‌ని బట్టి చూస్తోంటే, ఈ ప్రశ్నలకు సమాధానం 'ఔను' అనే అన్పిస్తోంది.…

'బాబు బంగారం' సినిమా తర్వాత నయనతార తెలుగు తెరపై కన్పించదా.? డబ్బింగ్‌ సినిమాల్లో మాత్రమే నయనతారని చూడాల్సి వస్తుందా.? టాలీవుడ్‌లో విన్పిస్తున్న గాసిప్స్‌ని బట్టి చూస్తోంటే, ఈ ప్రశ్నలకు సమాధానం 'ఔను' అనే అన్పిస్తోంది. వెంకటేష్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న 'బాబు బంగారం' సినిమాకి నయనతార కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దర్శకుడు ఎంత బతిమాలుతున్నా నయనతార, ఈ సినిమాకి సహకరించడంలేదట.

సినిమా కోసం ఓ డ్యూయెట్‌ చిత్రీకరించాల్సి వుండగా, దానికోసం అదనంగా డేట్స్‌ అడిగితే నయనతార ససేమిరా అనేయడం ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి తెలుగులో నయనతారకి మరీ అంత డిమాండ్‌ ఏమీ లేదు. కానీ, నయనతార మాత్రం విపరీతమైన డిమాండ్‌ వున్నట్లుగా హడావిడి చేస్తోంది. 'బాబు బంగారం' సినిమాకి ఒప్పుకున్నప్పుడు బాగానే వున్నా, ఆ తర్వాత సినిమా షూటింగ్‌లో నయనతార చుక్కలు చూపించేసిందట. 

ఇప్పుడు తీరిగ్గా దర్శకుడు మారుతి వాపోతున్నాడు నయనతార గురించి చెబుతూ. చిన్న సినిమాల దర్శకుడు కావడంతో మారుతితో నయనతార ఓ ఆట ఆడుకుందనీ, వెంకటేష్‌ని సైతం లెక్క చేయని స్థితిలో ఆమె వుందనీ చిత్ర యూనిట్‌ నుంచి గాసిప్స్‌ పుట్టుకొస్తున్నాయి. వెంకటేష్‌ అంటే టాలీవుడ్‌ టాప్‌ హీరోస్‌లో ఒకడు. దాంతో, వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న వెంకటేష్‌, నయనతార విషయంలో ఫిర్యాదు చేయడమే మంచిదని దర్శకుడు మారుతికి సూచించాడట. 

వ్యవహారం ముదిరి పాకాన పడ్తుందని తెలిసినా, నయనతారలో ఏమాత్రం భయం లేకపోవడం చూస్తోంటే, టాలీవుడ్‌ని ఆమె ఎంత లైట్‌ తీసుకుందో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. మరి, నయనతారని టాలీవుడ్‌ నుంచి బ్యాన్‌ చెయ్యడం ఒక్కటే మార్గమా.? ఏమో మరి, వేచి చూడాల్సిందే.