బండ్ల..వేసేసాడు

నిర్మాత బండ్ల గణేష్ చాలా జోరుగా వున్నాడు. వేదికపై బాలయ్య, మోహన్ బాబు ఇంకా పలువురు వుండగా మెగాస్టార్ చిరంజీవికి మాత్రం పాదాభివందనం చేసాడు. దాంతో బాలయ్య పక్కకు వెళ్లాడు. ఇప్పుడు అది వెబ్…

నిర్మాత బండ్ల గణేష్ చాలా జోరుగా వున్నాడు. వేదికపై బాలయ్య, మోహన్ బాబు ఇంకా పలువురు వుండగా మెగాస్టార్ చిరంజీవికి మాత్రం పాదాభివందనం చేసాడు. దాంతో బాలయ్య పక్కకు వెళ్లాడు. ఇప్పుడు అది వెబ్ లో వార్తగా మారి చక్కర్లు కొడుతోంది. 

ఇప్పుడు అక్కడితో ఆగకుండా ట్విట్టర్ లో కూడా ఓ సంచలన మెసేజ్ పోస్ట్ చేసాడు.  'అందరికీ పాదాభివందనం చేస్తే అడుక్కోడం  అంటారు. నచ్చినవారికి  చేస్తే దాన్ని అభిమానం అంటారు….'.ఇదీ బండ్ల చేసిన ట్వీట్..అంటే బండ్ల ఓపెన్ గా తనకు మెగా స్టార్ మీద అభిమానం వుందని అంగీకరించినట్లే. 

టెంపర్ విడుదలకు ముందు తనను మెగాస్టార్ మనిషిగా ముద్రవేసే ప్రయత్నం చేసారంటూ 'గ్రేట్ ఆంధ్ర' ఇంటర్వూలో చెప్పాడు. దానిపై ఎన్టీఆర్ గుస్సాయిస్తే, తప్పించుకోవడానికి కిందా మీదా అయ్యాడు. ఇప్పుడు ఆయనే ఓపెన్ గా మెగాస్టార్ కు పాదాభివందనం చేయడం కాకుండా, ఇలా ట్వీట్ చేయడం ద్వారా, తాను మెగాస్టార్ మనిషినే అని చెప్పకనే చెప్పాడు. ఇప్పుడు ఇది బాలయ్య ఫ్యాన్స్ కు కోపం తెప్పిస్తుందేమో?