Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఎట్టకేలకు ఇంద్రగంటి నుంచి మరో సినిమా

ఎట్టకేలకు ఇంద్రగంటి నుంచి మరో సినిమా

ఇంద్రగంటి-శ్రీదేవి మూవీస్ కాంబోలో సినిమా రాబోతున్న విషయాన్ని గ్రేట్ ఆంధ్ర ఇదివరకే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ప్రియదర్శి, రూప కొడువాయూర్ హీరో హీరోయిన్లుగా మొదలైన ఈ సినిమాను స్వీట్ ఎంటర్ టైనర్ గా చెబుతోంది యూనిట్. ఇంకా చెప్పాలంటే ఇంద్రగంటి మార్కు సినిమా.

సాధారణంగానే తక్కువ సినిమాలు చేస్తుంటారు ఇంద్రగంటి. అలాంటి డైరక్టర్ వరుసగా 2 ఫ్లాపులిచ్చేసరికి గ్యాప్ మరింత ఎక్కువైంది. 2020లో వచ్చిన 'వి' అనే సినిమాను తన స్టయిల్ కు భిన్నంగా తీసి ఫ్లాప్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత మళ్లీ రెండేళ్లకు 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే సినిమా తీసి మరో ఫ్లాప్ కొనితెచ్చుకున్నారు.

ఇలా 2 ఫ్లాపులిచ్చిన తర్వాత కెరీర్ లో మళ్లీ మరో రెండేళ్లు గ్యాప్ తీసుకున్నారు. మళ్లీ ఇన్నేళ్లకు తనకు కలిసొచ్చిన శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై సినిమా ప్రారంభించారు. గతంలో ఈ బ్యానర్ పై జెంటిల్ మేన్, సమ్మోహనం లాంటి హిట్స్ ఇచ్చారు ఇంద్రగంటి. ఈసారి హ్యాట్రిక్ కోసం ప్రయత్నం. 

ఎప్పట్లానే సుధీర్ బాబును కాకుండా ఈసారి ప్రియదర్శిని సెలక్ట్ చేసుకున్నారు ఈ డైరక్టర్. ఇక హీరోయిన్ గా తన పూర్వ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, మరోసారి తెలుగమ్మాయికే ఓటేశారు. ఇంద్రగంటి సినిమాల్లో రెగ్యులర్ గా కనిపించే సీనియర్ నరేష్ తనికెళ్ల భరణి, అవసరాల, వెన్నెల కిషోర్ లాంటి తారాగణమంతా కొత్త సినిమాలో కనిపించబోతోంది.

ఈరోజు హైదరాబాద్ లో షూటింగ్ కూడా మొదలుపెట్టారు. వివేక్ సాగ‌ర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?