Advertisement

Advertisement


Home > Movies - Movie News

మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హీరోయిన్

మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హీరోయిన్

మొన్నటికిమొన్న తన వ్యాఖ్యలతో వివాదానికి కేంద్రబిందువైంది కృతి సనన్. సినిమా హిట్టయితే హీరోల్ని తెగ పొగిడేస్తారని, ఫ్లాప్ అయితే మాత్రం హీరోయిన్ ను బలి పశువును చేస్తారంటూ కామెంట్ చేసింది. ఇప్పుడీ బ్యూటీ మరో కాంట్రవర్సీ స్టేట్ మెంట్ ఇచ్చింది. హీరోల వల్ల సినిమాలు ఆడవంటోంది కృతి.

హీరోల వల్ల సినిమాలు ఆడతాయనేది భ్రమ అంటోంది కృతి సనన్. హీరో స్టార్ డమ్ తో పాటు సినిమాలో కథ ఉన్నప్పుడు మాత్రమే ఆ మూవీ హిట్టవుతుందని, కేవలం హీరోయిజం పైన సినిమాలు నడవవని అంటోంది. కృతి సనన్ స్టేట్ మెంట్ ను చాలామంది చాలా సినిమాలకు అన్వయిస్తున్నారు. రీసెంట్ గా సల్మాన్ నటించి ఫ్లాప్ అయిన సినిమాలకు కృతి కామెంట్స్ ను ట్యాగ్ చేస్తున్నారు చాలామంది.

ఆమె నటించిన ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ ఒకటి బాలీవుడ్ లో హిట్టయింది. అప్పట్నుంచి కృతి సనన్ ఇలా స్టేట్ మెంట్స్ ఇస్తూనే ఉంది. బాలీవుడ్ లో నటీనటుల మధ్య ఐక్యత లేదన్న కృతి.. కేవలం హీరోల వల్ల సినిమాలు ఆడుతున్నాయనే భ్రమలో కొంతమంది దర్శకనిర్మాతలున్నారని ఆరోపించింది.

లేడీ ఓరియంటెడ్ సినిమాలకు ప్రేక్షకులు రారు కాబట్టి డబ్బులు పెట్టడం దండగని చాలామంది అనుకుంటున్నారని... ఈ భ్రమల నుంచి బయటకు రావాలని అంటోంది. హీరోల వల్ల సినిమాలు ఆడవని, హీరోలతో పాటు మంచి కథలు కావాలని.. అలాంటి మంచి స్టోరీలు దొరికినప్పుడు ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలు కూడా ఆడతాయని అంటోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?