Advertisement

Advertisement


Home > Politics - Andhra

ఎస్ కోటలో నో అంటున్న తమ్ముడు!

ఎస్ కోటలో నో అంటున్న తమ్ముడు!

విజయనగరం జిల్లా ఎస్ కోట టికెట్ దక్కని తమ్ముడు తిరుగు బాట బావుటా ఎగరేశారు. ఎస్ కోట టికెట్ మీద ఆశలు పెంచుకుని చాలాకాలంగా పనిచేస్తూ వస్తున్న ఎన్నారై గొంప క్రిష్ణ ఇపుడు టీడీపీ కొంప ముంచబోతున్నారు అని టాక్. ఆయన తనకు టికెట్ ఇవ్వకుండా చివరి నిముషంలో పావులు కదిపారంటూ కొందరు టీడీపీ పెద్దల మీద మండిపడ్డారు.

పార్టీ పదవులకు ఆయనతో పాటు ఆయన వర్గం రాజీనామాలు  చేసింది. తన పార్టీ కార్యాలయం ముందు ఉన్న టీడీపీ బొమ్మను సైకిల్ గుర్తుని ఆయన చెరిపేయడం విశేషం. తనకు టికెట్ రాకుండా చేసిన వారి మీద ఆయన మండిపడ్డారు. ఇండిపెండెంట్ గా తాను పోటె చేస్తాను తన సత్తాను చాటుతాను అని అంటున్నారు. అనుచరులతో కలసి రెండు రోజులలో తన కార్యాచరణను చర్చిస్తాను అని గొంప క్రిష్ణ ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి వర్గీయులు రెచ్చగొట్టే మాటలు మానుకోవాలని కూడా ఆయన హెచ్చరించారు.

చంద్రబాబు లోకేష్ ల ఆదేశం మేరకు నియోజకవర్గంలో పార్టీని గత కొన్నేళ్ళుగా అభివృద్ధి చేస్తూ వచ్చానని తీరా ఎన్నికల ముంగిట తనకు షాక్ ఇచ్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

గొంప క్రిష్ణకు యూత్ లో మంచి పలుకుబడి ఉంది. నవతరం నేతగా గుర్తింపు ఉంది. ఆయన ఇండిపెండెంట్ గా చేసినా లేక మౌనంగా ఉన్నా అది ఎస్ కోటలో టీడీపీకి భారీ నష్టం చేకూరుస్తుందని అంటున్నారు. పసుపు శిబిరం కొంప ముంచేలా గొంప ఆవేశం ఉందని అంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?