Advertisement

Advertisement


Home > Movies - Movie News

జాను రిజల్ట్‌తో పింక్‌ భయం

జాను రిజల్ట్‌తో పింక్‌ భయం

దిల్‌ రాజు ఇన్నేళ్లలో తొలిసారిగా రీమేక్‌ చేసిన చిత్రం ‘జాను’. ఎమోషనల్‌ వ్‌స్టోరీ కావడంతో దిల్‌ రాజు ఈ చిత్రం ఖచ్చితంగా వర్కవుట్‌ అవుతుందని అనుకున్నాడు. సమంత, శర్వానంద్‌ లాంటి పేరున్న నటీనటులు  వుండడం వల్ల బడ్జెట్‌ ఎక్కువయినా ఫర్వాలేదని దిగిపోయాడు. కానీ లిమిటెడ్‌ ఆడియన్స్‌కి అప్పీల్‌ అయ్యే అలాంటి చిత్రాన్ని పది కోట్ల మార్జిన్‌లో కాకుండా ఇరవై కోట్లలో చేయడం వల్ల  మొత్తం రివర్స్‌ అయింది.

ఇప్పుడు దిల్‌ రాజు బ్యానర్‌ నుంచి రానున్న పింక్‌ రీమేక్‌పై భయం నెలకొంది. అది కూడా లిమిటెడ్‌ ఆడియన్స్‌కి అప్పీల్‌ అయ్యే కథ కావడంతో పవన్‌ కళ్యాణ్‌ వున్నా కానీ వర్కవుట్‌ అవుతుందా అని ట్రేడ్‌ అనుమానిస్తోంది. పైగా ఈ చిత్రానికి వంద కోట్ల బిజినెస్‌ లెక్కలు  వేసుకుని కూర్చున్నారు. అది కానీ రివర్స్‌ అయితే ఇక అంతే సంగతులు.

పింక్‌ చిత్రాన్ని చాలా మంది ఆల్రెడీ చూసేసి వుండడం, అలాంటి సీరియస్‌ పాత్రలు  పవన్‌కి సూట్‌ అవ్వవనే అభిప్రాయం వుండడంతో ఈ చిత్రానికి బిజినెస్‌ జరగడం అంత ఈజీ కాదంటున్నారు. అయితే దిల్‌ రాజు ఈ చిత్రం కోసమని పవన్‌కి ఏకంగా నలభై కోట్ల పారితోషికం ఇచ్చేసాడు. పవన్‌ని చూడ్డానికి అయినా ప్రేక్షకులు  బారులు తీరతారనేది అతని నమ్మకం కావచ్చు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?