హిట్ అయితే పార్ట్ 2 అంట

ప్రతి సినిమాకు సీక్వెల్ కు ముందే ప్లాన్ చేసుకోవడం మామూలైపోయింది. ఈ వారి వచ్చిన సినిమా, వచ్చేవారం రాబోయే సినిమా, రెండింటికీ సీక్వెల్ వుంటాయని ముందే చెప్పేసారు. ఆంధ్రపోరి సినిమాను ఓ స్టేజ్ లో…

ప్రతి సినిమాకు సీక్వెల్ కు ముందే ప్లాన్ చేసుకోవడం మామూలైపోయింది. ఈ వారి వచ్చిన సినిమా, వచ్చేవారం రాబోయే సినిమా, రెండింటికీ సీక్వెల్ వుంటాయని ముందే చెప్పేసారు. ఆంధ్రపోరి సినిమాను ఓ స్టేజ్ లో ఆపేసి, టుబి కంటిన్యూడ్ అని వేసేసారు. మరి తీయాలంటే, హీరో ఆకాష్ పూరి కాస్త పెద్దవ్వాలి. అంటే మరో మూడేళ్ల వరకు దానికి సీక్వెల్ కష్టం. 

ఇక వచ్చేవారం రాబోయే జ్యోతిలక్ష్మి సినిమాకు కూడా సీక్వెల్ తీయాలని వుందట దర్శకుడు పూరి జగన్నాథ్ కు. ఈ సినిమాను హిట్ చేసి, సీక్వెల్ తీసే అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాఅని ముందే ఆడియన్స్ ను వేడుకున్నాడు ఆయన. మరి ఆ ఆయనకు ఆ అవకాశం ఇస్తారో ఇవ్వరో వారం రోజులు ఆగితే తెలుస్తుంది.