అక్కినేని ఫ్యామిలీ మహేశ్ ను మరీ మొహమాటపెట్టిందా!

సాధారణంగా ఇతర హీరోల సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్లలో కనిపించడు ప్రిన్స్ మహేశ్ బాబు. తన సొంత బావ సినిమాలకు కూడా మరీ అంత ప్రాధాన్యత ఇవ్వడు. ఒక ట్వీట్ పెట్టి.. ఆల్ ద…

సాధారణంగా ఇతర హీరోల సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్లలో కనిపించడు ప్రిన్స్ మహేశ్ బాబు. తన సొంత బావ సినిమాలకు కూడా మరీ అంత ప్రాధాన్యత ఇవ్వడు. ఒక ట్వీట్ పెట్టి.. ఆల్ ద బెస్ట్ చెప్పి.. ఊరుకొంటూ ఉంటాడు.

అయితే మరీ ఎక్కువ ఒత్తిడి వస్తే తప్ప సినిమా లాంచింగులకు, ఆడియో విడుదల కార్యక్రమాలకు వెళ్లే పనులను పెట్టుకోడు మహేశ్. అప్పుడెప్పుడో సాయికుమార్ తనయుడి లాంచింగ్ సమయంలో మహేశ్ కనిపించాడు. ఇప్పుడు మళ్లీ నాగార్జున తనయుడు లాంచింగ్ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో కనిపించాడు. 

మరి ఇలా అఖిల్ సినిమా ఆడియో విడుదల వేడుకకు మహేశ్ హాజరవ్వడం వెనుక ఆసక్తికరమైన తతంగమే జరిగినట్టుగా తెలుస్తోంది. మొదట మహేశ్ ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి అంత ఆసక్తి చూపనట్టుగా తెలుస్తోంది.

కావాలంటే ఒక వీడియో మెసేజ్ ను పంపి అఖిల్ ను విష్ చేద్దామని అనుకున్నాడట ప్రిన్స్. అయితే ఆ విషయాన్ని తెలుసుకుని… ఈ కార్యక్రమానికి స్టార్ వ్యాల్యూను ఆశించిన అక్కినేని ఫ్యామిలీ మళ్లీ ప్రత్యేకంగా మహేశ్ ను సంప్రదించినట్టుగా తెలుస్తోంది.

కచ్చితంగా రావాల్సిందేనని మొహమాట పెట్టినట్టుగా సమాచారం. దీంతో కాదనలేక.. మొహమాటం కొద్దే మహేశ్ ఈ కార్యక్రమానికి హాజరైనట్టుగా ఇండస్ట్రీ టాక్.  ఆడియో విడుదల వేడుకలో మాత్రం నాగార్జున తనకు ఘట్టమనేని ఫ్యామిలీతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు. వాళ్లు తనకు ఎంత ఆప్తులో వివరించాడు.

మొదట్లో ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ కూడా హాజరవుతాడని వార్తలు వచ్చాయి. అయితే పవన్ హ్యాండిచ్చాడు. మహేశ్ మాత్రం తప్పని సరి పరిస్థితుల్లో హాజరయినట్టుగా తెలుస్తోంది.