నిఖిల్ పక్కన నిత్య?

ఆనంద్. ఇటీవల సందీప్ కిషన్ తో టైగర్ సినిమా చేసిన దర్శకుడు. ఈ దర్శకుడు తొలి సినిమా తరువాత ఓ కథ తయారుచేసుకుని, హీరోగా రాహుల్ రవీంద్రన్ ను ఫిక్స్ చేసుకుని, నిర్మాత కావలెను…

ఆనంద్. ఇటీవల సందీప్ కిషన్ తో టైగర్ సినిమా చేసిన దర్శకుడు. ఈ దర్శకుడు తొలి సినిమా తరువాత ఓ కథ తయారుచేసుకుని, హీరోగా రాహుల్ రవీంద్రన్ ను ఫిక్స్ చేసుకుని, నిర్మాత కావలెను అంటూ తెగ తిరిగాడు.

ఇంతలో సుడి తిరిగి ఆ కథ నిఖిల్ కు నచ్చేసింది. ఇప్పుడు నిఖిలే నిర్మాతను సెట్ చేసుకుంటున్నాడు. అయితే కథ లైన్ కాస్త ఆసక్తి కరంగానే వుంటుంది కానీ, కాస్త బడ్జెట్ ఎక్కువ, పైగా స్టోరీ కాస్త క్లిష్టంగా వుంటుంది అని వినికిడి.

ఈ సినిమాకు కాస్త నటన వచ్చిన హీరోయిన్లు కావాలి. ముఖ్యమైన హీరోయిన్ గా నిత్య మీనన్ అయితేనే కథ పండుతుంది అన్నది దర్శకుడి ఐడియాగా తెలుస్తోంది. కానీ నిత్య జనవరి వరకు ఖాళీ లేదు.

మిగిలిన రెండు క్యారెక్టర్లకు రెజీనా, ప్రియమణి కానీ మరొకరు కానీ అని అనుకుంటున్నారు.కలర్ స్వాతి, రాథికా ఆంప్టే పేర్లు పరిశీలనలో వున్నాయి.మొత్తానికి రాహుల్ రవీంద్రన్ నుంచి ఈ కథ నిఖిల్ దగ్గరకు వచ్చి ఆగింది.