గోపీ సుందర్ బిజీ అయిపోతున్నాడా?

హిట్ వస్తే రేటు పెరుగుతుంది..వర్క్ పెరుగుతుంది. భలేభలే మగాడివోయ్ సినిమాతో మరోసారి టాలీవుడ్ దృష్టిని ఆకర్షించాడు సంగీత దర్శకుడు గోపీ సుందర్. Advertisement మళ్లీ మళ్లీ ఇది రాని రోజుతో టాలీవుడ్ లో అడుగుపెట్టాడు.…

హిట్ వస్తే రేటు పెరుగుతుంది..వర్క్ పెరుగుతుంది. భలేభలే మగాడివోయ్ సినిమాతో మరోసారి టాలీవుడ్ దృష్టిని ఆకర్షించాడు సంగీత దర్శకుడు గోపీ సుందర్.

మళ్లీ మళ్లీ ఇది రాని రోజుతో టాలీవుడ్ లో అడుగుపెట్టాడు. భలేభలే మగాడివోయ్ సినిమాతో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు నాగార్జునతో దోస్త్ సినిమా చేస్తున్నాడు. మరోపక్క రాజ్ తరుణ్ సినిమా ఒకటి ఓకె చేసాడు. ఇప్పటికే మలయాళంలో బిజీ. దాదాపు యాభై సినిమాల వరకు చేసాడక్కడ.

అయితే తెలుగులో చేస్తే ఆ కిక్కే వేరు. ఎందుకంటే మలయాళంలో రెమ్యూనరేషన్లు తక్కువ. మన దగ్గర కాస్త పేరు, క్వాలిటీ వుంటే కనీసం నలభై యాభై లక్షలు రెమ్యూనిరేషన్ వచ్చేస్తుంది. అందుకే గొపీ ఇప్పుడు తెలుగు ఫీల్డ్ వైపు చూస్తున్నాడు. కానీ అలా అని హర్రీగా ఒప్పేసుకోవడం లేదట. మంచి ప్రాజెక్టులు, మంచి రెమ్యూనిరేషన్ కలిసి వచ్చే ప్రాజెక్టుల కోసం వెయిట్ చేస్తున్నాడట.

ఇటీవల భలే భలే మగాడివోయ్ విడుదల కు ముందు వెళ్లిన వాళ్లకి చేద్దాం అని చెప్పి, తీరా విడుదలయిన తరువాత చూద్దాం అన్నాడట. అంటే తెలివైన వాడే అన్నమాట.