మాటకు కట్టుబడిన నిర్మాత

దిల్ రాజు సారథ్యంలో కొంత మంది నిర్మాతలు సినిమా నిర్మాణ వ్యయాన్ని తగ్గించాలని కిందా మీదా పడుతున్న సంగతి తెలిసిందే. అయితే నిర్ణయాలైతే తీసుకుంటారు కానీ, తీరా వాస్తవానిక వచ్చేసరికి ఖర్చు తప్పడంలేదు. ఇది…

దిల్ రాజు సారథ్యంలో కొంత మంది నిర్మాతలు సినిమా నిర్మాణ వ్యయాన్ని తగ్గించాలని కిందా మీదా పడుతున్న సంగతి తెలిసిందే. అయితే నిర్ణయాలైతే తీసుకుంటారు కానీ, తీరా వాస్తవానిక వచ్చేసరికి ఖర్చు తప్పడంలేదు. ఇది గతంలో చాలా సార్లు జరిగింది. 

అయితే దిల్ రాజు బృందంలో వున్న నిర్మాత దామోదర ప్రసాద్ (రంజిత్ మూవీస్) మాత్రం తన తాజా సినిమాకు రెండో కోట్ల లోపు వ్యయంతోనే పూర్తిచేసేసారట. కొత్త నటులతో, దర్శకుడు తేజతో చేస్తున్న సినిమా ఇది. కర్ణాటకలో, విశాఖలో షూటింగ్ జరుపుకుంది. దీన్ని మహా అయితే కోటిన్నర నుంచి రెండు కోట్ల మధ్యలో కానిచ్చేసారట. 

నిర్మాణ వ్యవహారంలో చాలా కట్టుదిట్టంగా వ్యవహరించడమే కాదు, షూటింగ్ స్పాట్ లో భోజనాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకున్నారట. ఎంతమంది వర్క్ చేస్తే అంతమందికే భోజనాలు వంటి కాస్ట్ కటింగ్ అమలు చేసారట. కోటిన్నర నుంచి రెండు కోట్లు అంటే ఏముంది? సినిమా హిట్ అయితే చాలు శాటిలైట్ తోనే వచ్చేస్తుంది ఖర్చంతా. నిర్మాతలంతా ఇలా జాగ్రత్త పడితే బాగానే వుంటుంది.