ప‌వ‌న్ రేంజులో సంపూ పాట‌

కాట‌మ‌రాయుడా.. క‌దిరీ న‌ర‌సింహుడా – అంటూ ప‌వ‌న్ కల్యాణ్ వీర‌లెవిల్లో గానం చేసిన దృశ్యం.. ఇప్పటికీ ప‌వ‌న్ ఫ్యాన్స్ క‌ళ్ల ముందు గింగిరాలు తిరుగుతూనే ఉంది. అత్తారింటికి దారేది ఆడియోలో ఈ పాట లేక‌పోయినా……

కాట‌మ‌రాయుడా.. క‌దిరీ న‌ర‌సింహుడా – అంటూ ప‌వ‌న్ కల్యాణ్ వీర‌లెవిల్లో గానం చేసిన దృశ్యం.. ఇప్పటికీ ప‌వ‌న్ ఫ్యాన్స్ క‌ళ్ల ముందు గింగిరాలు తిరుగుతూనే ఉంది. అత్తారింటికి దారేది ఆడియోలో ఈ పాట లేక‌పోయినా… వెండి తెర‌పై మాత్రం కిక్ అందించింది. ఈ పాట‌ని ప‌వ‌న్ పాడిన విధానం.. ఆ హుషారు చూసి ఫ్యాన్స్ ముందే ఖుషీ అయిపోయారు. 

అత్తారింటికి దారేరి ప‌బ్లిసిటీలో ఈ పాట‌ని బాగా వాడుకొన్నారు. సీన్ క‌ట్ చేస్తే… స‌రిగ్గా ఇలాంటి జోరున్న పాట‌తో సంపూ కూడా రంగంలోకి దిగిపోతున్నాడు. త‌న ఫ్యాన్స్ (ఉన్నారు లెండి..)ని రంజిపంచేయ‌డానికి గొంతు స‌వ‌రించుకొని ఓ పాట పాడేయ‌బోతున్నాడు. సంపూ బాబు హీరోగా న‌టిస్తున్న రెండో సినిమా కొబ్బరిమ‌ట్ట‌. ఇందులో సంపూ మూడు పాత్రల్లో ద‌ర్శన‌మిస్తాడట‌. 

ఇప్పుడు ఓ పాట కూడా పాడేయ్యబోతున్నాడు. ఈ పాట‌ని షూట్ చేసి… కొబ్బరిమ‌ట్ట ప్రమోష‌న్లలో వాడుకొంటార‌ట‌. హృద‌య కాలేయం అంటూ ఒక్క పోస్టర్ చూపిస్తే నే జ‌నాలు తండోప‌తండాలుగా వ‌చ్చారు. పాట పాడితే.. థియేట‌ర్ల ముందు కోలాహ‌ల‌మే అని చిత్రబృందం ఫిక్సయి ఉంటుంది. మ‌రి గాయ‌కుడిగా సంపూ ప్రతిభ ఏ రేంజులో ఉంటుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాలి.