డైరక్టర్ సుక్కూతో జర జాగ్రత్త

ఇల్లు అలికేస్తే పండగ వచ్చేసినట్లు కాదు. ఇంకా చాలా వ్యవహారాలుంటాయి. యూరప్ లో సినిమా తీస్తే, ఈరోస్ వాళ్లతో టై అప్ అయితే 40శాతం సబ్సిడీ వస్తుందని కిందామీదా అయ్యారు 14 రీల్స్ సంస్థ…

ఇల్లు అలికేస్తే పండగ వచ్చేసినట్లు కాదు. ఇంకా చాలా వ్యవహారాలుంటాయి. యూరప్ లో సినిమా తీస్తే, ఈరోస్ వాళ్లతో టై అప్ అయితే 40శాతం సబ్సిడీ వస్తుందని కిందామీదా అయ్యారు 14 రీల్స్ సంస్థ వారు. దర్శకుడు సుకుమార్ వాళ్లకు చూపించిన సినిమా అలాంటిది. 

ఇప్పుడు నిర్మాత భోగవిల్లి ప్రసాద్ కు కూడా అలాంటి సినిమానే చూపించినట్లున్నాడు. ఆ సినిమా యూనిట్ కూడా ఛలో యూరప్ అంటోంది. దోచేయ్ సినిమా అంటూనే ఆ డైరక్టర్ సుధీర్ వర్మ, స్వామిరారా ను అటుఇటు మార్చి చూపించాడు నిర్మాత ప్రసాద్ కు. దాంతో ఆయన పాపం 12 కోట్లు పోసారు. తీరా చేస్తే తెరపైకి స్వామిరారా వచ్చేసింది. 

ఇప్పుడు సుకుమార్ ఏం చూపించాడో, స్క్రీన్ మీదకు ఏం వస్తుందో..ప్రసాద్ గారూ ఈసారైనా జర జాగ్రత్త.