ఛార్మికి బ్రేకిస్తున్న జగన్‌

టాప్‌ హీరోలతో మాస్‌ సినిమాలు చేసేసి, ఆ తర్వాత సోలో హీరోయిన్‌గానూ చాలా చిత్రాలే చేసిన ఛార్మి కెరీర్‌ ఏనాడో చివరి దశకి చేరుకుంది. హీరోయిన్‌గా అవకాశాలు రాక ఐటెమ్‌ సాంగ్స్‌తో కాలక్షేపం చేసిన…

టాప్‌ హీరోలతో మాస్‌ సినిమాలు చేసేసి, ఆ తర్వాత సోలో హీరోయిన్‌గానూ చాలా చిత్రాలే చేసిన ఛార్మి కెరీర్‌ ఏనాడో చివరి దశకి చేరుకుంది. హీరోయిన్‌గా అవకాశాలు రాక ఐటెమ్‌ సాంగ్స్‌తో కాలక్షేపం చేసిన ఛార్మి పని ఇక అయిపోయినట్టే అనుకుంటోన్న దశలో ఆమెకి బంపర్‌ లాటరీ తగిలేసింది. 

పూరి జగన్నాథ్‌ మొట్టమొదటిసారిగా ఒక లేడీ ఓరియెంటెడ్‌ సినిమా చేస్తున్నాడు. ఛార్మి కథానాయికగా ‘జ్యోతిలక్ష్మి’ అనే చిత్రాన్ని అనౌన్స్‌ చేసిన పూరి జగన్నాథ్‌ని ఎవరూ అంత సీరియస్‌గా తీసుకోలేదు. కేవలం ప్రకటనకే పరిమితమయ్యే ప్రాజెక్ట్‌ అనుకున్నారు. కానీ ‘టెంపర్‌’ తర్వాత ‘జ్యోతిలక్ష్మి’ చిత్రాన్ని మొదలు పెట్టాలని పూరి ఫిక్సయ్యాడు. 

ఫిబ్రవరి 20న జ్యోతిలక్ష్మి చిత్రం మొదలు కానుంది. దీంతో పాటు జగన్‌ డైరెక్ట్‌ చేసే వరుణ్‌ తేజ్‌ చిత్రాన్ని కూడా సి. కళ్యాణ్‌ నిర్మిస్తున్నాడు. కెరీర్‌ ముగిసిందనే టైమ్‌లో జగన్‌లాంటి స్టార్‌ డైరెక్టర్‌తో బయో పిక్‌ చేయడం ఛార్మి అదృష్టమనే అనుకోవాలి. మరి ఈ బ్రేక్‌ని వాడుకుని ఛార్మి కెరీర్‌ మరికొన్నేళ్లు ఎక్స్‌టెండ్‌ అవుతుందేమో చూడాలి.