శ్రియ సుడి తిరిగింది

కొన్నాళ్ల క్రితం వరకు అవకాశాలు దొరక్క నానా పాట్లు పడిన శ్రియ ఇప్పుడు సడన్‌గా బిజీ అయిపోయింది. ‘మనం’లో నాగార్జున సరసన నటించిన శ్రియ త్వరలో బాలకృష్ణతో జంట కడుతుందని తెలిసింది. బాలకృష్ణ నటించే…

కొన్నాళ్ల క్రితం వరకు అవకాశాలు దొరక్క నానా పాట్లు పడిన శ్రియ ఇప్పుడు సడన్‌గా బిజీ అయిపోయింది. ‘మనం’లో నాగార్జున సరసన నటించిన శ్రియ త్వరలో బాలకృష్ణతో జంట కడుతుందని తెలిసింది. బాలకృష్ణ నటించే తదుపరి చిత్రంలో శ్రియ ఒక కథానాయిక అనే టాక్‌ వినిపిస్తోంది. 

ఇంతకుముందు బాలకృష్ణతో చెన్నకేశవరెడ్డి చిత్రంలో శ్రియ నటించింది. పదేళ్ల క్రితం బాలకృష్ణకి జంట కట్టిన శ్రియ ఇప్పటికీ అతని సరసన నటించడమంటే విశేషమనే చెప్పాలి. నాగార్జునతో కూడా చాలా గ్యాప్‌ తర్వాత నటించిన శ్రియ హీరోయిన్లకి అరుదుగా వచ్చే అవకాశాన్ని దక్కించుకుంది. 

పదేళ్లకి పైగా చిత్ర సీమలో ఉండడం… అన్నేళ్ల తర్వాత కూడా అదే హీరోకి జంట కట్టడం హీరోయిన్లకి అంత ఈజీ విషయం కానే కాదు. ఈ విషయంలో శ్రియ అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నట్టుంది. బాలయ్య హీరోగా సత్య దేవ్‌ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించే గాడ్సేలో శ్రియ ఓ కథానాయిక కాగా మరో హీరోయిన్‌గా కృతి కర్బందా నటిస్తుందని న్యూస్‌.