విజ‌య‌శాంతి రీ ఎంట్రీ

ఒకప్పుడు స్టార్ హీరోల‌తో పాటు స‌మానంగా పారితోషికం తీసుకొని.. త‌న స్టామినా చూపించిన క‌థానాయిక విజ‌య‌శాంతి. బాల‌కృష్ణ‌, చిరంజీవి, వెంక‌టేష్‌.. వీళ్లంద‌రికీ హిట్ పెయిర్ అయిపోయింది. ఆ త‌ర‌వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ లేడీ…

ఒకప్పుడు స్టార్ హీరోల‌తో పాటు స‌మానంగా పారితోషికం తీసుకొని.. త‌న స్టామినా చూపించిన క‌థానాయిక విజ‌య‌శాంతి. బాల‌కృష్ణ‌, చిరంజీవి, వెంక‌టేష్‌.. వీళ్లంద‌రికీ హిట్ పెయిర్ అయిపోయింది. ఆ త‌ర‌వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ లేడీ అమితాబ్‌గా గుర్తింపు తెచ్చుకొంది. 

పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చాక‌… సినిమాల‌కు దూర‌మైంది. ఇప్పుడు విజ‌య‌శాంతి మ‌ళ్లీ న‌టించ‌బోతోంద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ టాక్‌. గోపీచంద్ – బి.గోపాల్ క‌ల‌యిక‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. ఈ చిత్రంలో ఓ కీల‌క‌మైన పాత్ర కోసం విజ‌య‌శాంతిని సంప్రదించిన‌ట్టు తెలుస్తోంది. 

విజ‌య‌శాంతికి కూడా ఈ పాత్ర ఎంత‌గానో న‌చ్చింద‌ని, అందుకే మ‌రో ఆలోచ‌న లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింద‌ని టాక్‌. విజ‌య‌శాంతి గ‌నుక సినిమాల్ని ఇప్పుడు సీరియ‌స్‌గా తీసుకొంటే.. ఆమెకు మ‌రిన్ని మంచి అవ‌కాశాలు ద‌క్కడం ఖాయం. గతంలొ బి గోపాల్ డైరక్షన్ లో లారీ డ్రయివర్ లాంటి సూపర్ హిట్ లలో ఆమె నటించింది కూడా.