కాజల్‌ లేదా నయనతార కావాల్సిందే!!

సచిన్‌ జోషి అనే కుర్రాడు గుర్తున్నాడా?  మాణిక్‌చంద్‌ గుట్కా వ్యాపార సామ్రాజ్యానికి ఈ కుర్రాడు వారసుడు. ముంబాయి కింగ్‌ అయిన కుర్రాడు గతంలో తెలుగులో హీరోగా కొన్ని సినిమాలు చేశాడు. ‘ఒరేయ్‌ పండు’, ‘మౌనమేలనోయి’…

సచిన్‌ జోషి అనే కుర్రాడు గుర్తున్నాడా?  మాణిక్‌చంద్‌ గుట్కా వ్యాపార సామ్రాజ్యానికి ఈ కుర్రాడు వారసుడు. ముంబాయి కింగ్‌ అయిన కుర్రాడు గతంలో తెలుగులో హీరోగా కొన్ని సినిమాలు చేశాడు. ‘ఒరేయ్‌ పండు’, ‘మౌనమేలనోయి’ వంటి ఫ్లాప్‌ చిత్రాలు వచ్చాయి. ఆ తర్వాత ముంబాయి వెళ్లిపోయి వ్యాపారాలు చూసుకుంటూ ఉండిపోయాడు. ఇటీవల హిందీలో సన్నీలియోన్‌తో ఓ సినిమా చేశాడు. ఫలితం షరా మామూలే!

అయితే ఈ సచిన్‌ జోషి ఇప్పుడు మళ్లీ తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వాలని ఉత్సాహపడుతున్నాడుట. అల్లాటప్పా సినిమా గా కాకుండా.. ఓపెనింగ్‌కు ముందే.. ఇది భారీ అంచనాలతో రూపొందుతున్న భారీ చిత్రం అనే ఇమేజి వచ్చేలాగా.. బండ్ల గణేష్‌ నిర్మాతగా ఈ చిత్రం చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకు బండ్ల గణేష్‌ కూడా సై అన్నారని సమాచారం.

అయితే ఒక్క విషయంలోనే పేచీ వస్తోంది. తన సరసన హీరోయిన్‌గా కాజల్‌ అగర్వాల్‌ గానీ, నయనతార గానీ కావాల్సిందే అని ఈ సచిన్‌ జోషి ముచ్చటపడుతున్నాడుట. అయితే.. అంత అవసరం ఏముంది బాబూ.. కొత్త హీరోయిన్‌కు లైఫ్‌ ఇద్దాం అని ఎందరు ఎన్ని రకాలుగా సర్దిచెప్పినా వినిపించుకోవడం లేదుట. అయినా.. ఆ కుర్రాడి అమాయకత్వం గానీ.. ఆ రేంజి హీరోయిన్లు ఎంత డబ్బు ముడితే మాత్రం ఈ హీరోతో ఎందుకు చేస్తారు లెమ్మని అనుకుంటున్నారు సినీజనం.