మొత్తం రిస్క్‌ చేస్తున్న మోహన్‌బాబు

‘పాండవులు పాండవులు తుమ్మెద’ చిత్రానికి ముప్పయ్‌ కోట్ల బడ్జెట్‌ అయిందని మోహన్‌బాబు చెబుతున్నారు. ఈ చిత్రానికి ఖర్చు విషయంలో రాజీ పడలేదని, క్వాలిటీ సినిమా అందించడానికి ప్రయత్నించామని ఆయన అంటున్నారు. మోహన్‌బాబు, ఆయన ఇద్దరు…

‘పాండవులు పాండవులు తుమ్మెద’ చిత్రానికి ముప్పయ్‌ కోట్ల బడ్జెట్‌ అయిందని మోహన్‌బాబు చెబుతున్నారు. ఈ చిత్రానికి ఖర్చు విషయంలో రాజీ పడలేదని, క్వాలిటీ సినిమా అందించడానికి ప్రయత్నించామని ఆయన అంటున్నారు. మోహన్‌బాబు, ఆయన ఇద్దరు కొడుకులతో పాటు వరుణ్‌ సందేశ్‌, తనీష్‌ నటించిన ఈ చిత్రానికి బిజినెస్‌ పరంగా మంచి ఆఫర్స్‌ వచ్చాయట. 

ఈ చిత్రానికి ఇరవై కోట్ల రూపాయల బిజినెస్‌ జరిగే అవకాశం ఉందని, కానీ సేఫ్‌గా ఉండాలనే ఉద్దేశంతో నష్టానికి సినిమాని అమ్మదలుచుకోలేదని, ఆ బాబా ఆశీస్సుల వల్ల ఈ చిత్రం బాగా తెరకెక్కిందని, తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతుందని మోహన్‌బాబు ఆశాభావం వ్యక్తం చేసారు. అన్ని ఏరియాల్లోను ఈ చిత్రాన్ని ఆయన స్వయంగా రిలీజ్‌ చేస్తున్నారు.     

ఇంత ఖర్చు పెట్టిన సినిమాని సొంతంగా రిలీజ్‌ చేయడమంటే చాలా పెద్ద రిస్క్‌. అయినా కానీ సినిమాపై నమ్మకంతో మోహన్‌బాబు రిస్కు చేయడానికే సిద్ధపడ్డారు. విడుదల విషయంలో కూడా ఆయన రాజీ పడడం లేదు. పెద్ద సినిమాలకి తీసిపోకుండా ‘పాపాతు’ని ప్రపంచవ్యాప్తంగా వందలాది థియేటర్లలో దీనిని విడుదల చేస్తున్నారు.