మళ్లీ అదే కాంబినేషన్లో థ్రిల్లర్

మెంటల్ మదిలో అంటూ ఓ కొత్త తరహా సినిమా అందించే ప్రయత్నం చేసాడు నిర్మాత రాజ్ కందుకూరి. కొత్త దర్శకుడు వివేక్ ఆత్రేయను పరిచయం చేసాడు. తక్కువ ఖర్చులో మంచి అవుట్ పుట్ తీసి,…

మెంటల్ మదిలో అంటూ ఓ కొత్త తరహా సినిమా అందించే ప్రయత్నం చేసాడు నిర్మాత రాజ్ కందుకూరి. కొత్త దర్శకుడు వివేక్ ఆత్రేయను పరిచయం చేసాడు. తక్కువ ఖర్చులో మంచి అవుట్ పుట్ తీసి, ఫరవాలేదు అనిపించుకున్నాడు. ఇప్పుడు మళ్లీ అదే కాంబినేషన్ లో మరో సినిమా చేయబోతున్నారట. మెంటల్ మదిలో సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించిన సురేష్ బాబు ఈ సినిమాను కూడా సమర్పిస్తారు.

ఈ సినిమాకు టైటిల్ కూడా ఫిక్స్ చేసేసారు. బ్రోచేవారెవరురా? అన్నది టైటిల్. అయితే మిగిలిన వ్యవహారాలు ఏవీ ఇంకా ఫిక్స్ కాలేదు. మరో నెల రోజుల్లో కాస్టింగ్ తదితర వ్యవహారాలు ఫిక్స్ చేస్తారు. వాస్తవానికి బ్రోచేవారెవరురా సబ్జెక్ట్ ను వివేక్ తన తొలిసినిమా మెంటల్ మదిలోకి ముందుగానే చెప్పాడు. కానీ అది థ్రిల్లర్ సబ్జెక్ట్ కాస్త స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ అదీ టిపికల్ గా వుంటుంది. అందుకని మెంటల్ మదిలో లాంటి లైటర్ సబ్జెక్ఠ్ ను ముందు తీసుకున్నారు.

ఇప్పుడు డైరక్టర్ మీద కాన్ఫిడెన్స్ పెరగడంతో రెండో సినిమాను వెంటనే స్టార్ట్ చేస్తున్నారు. దీనికి కాస్త గట్టి స్టార్ట్ కాస్టింగ్ నే కావాలి. మరి ఎవర్ని తీసుకుంటారో వేచి చూడాలి.