రెండేళ్ల శ్రమ కొలిక్కి వచ్చింది

బాహుబలి తర్వాత మళ్లీ ఆ స్థాయిలో తెరకెక్కిన చిత్రం 2.0. బాహుబలి సిరీస్ కంటే తక్కువ సమయం తీసుకున్నప్పటికీ.. ఎక్కువ ఖర్చు అయింది మాత్రం ఈ చిత్రానికే. అలా రెండేళ్లుగా జనాల్లో నలుగుతూ, ప్రతిసారి…

బాహుబలి తర్వాత మళ్లీ ఆ స్థాయిలో తెరకెక్కిన చిత్రం 2.0. బాహుబలి సిరీస్ కంటే తక్కువ సమయం తీసుకున్నప్పటికీ.. ఎక్కువ ఖర్చు అయింది మాత్రం ఈ చిత్రానికే. అలా రెండేళ్లుగా జనాల్లో నలుగుతూ, ప్రతిసారి ఏదో ఒక వార్తతో సంచలనం సృష్టిస్తున్న 2.0 సినిమా ఎట్టకేలకు చివరి షెడ్యూల్ లోకి ఎంటరైంది.

ఈరోజు నుంచి ముంబయిలో ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ మొదలవుతుంది. ఇప్పటికే టాకీ పార్ట్ తో పాటు పాటల షూటింగ్ కూడా పూర్తిచేసిన యూనిట్.. మిగిలిన ఒక్క పాటను ఇవాళ్టి నుంచి 4 రోజుల పాటు షూట్ చేయబోతున్నారు. రజనీకాంత్, ఎమీ జాక్సన్ మధ్య తెరకెక్కించనున్న ఈ సాంగ్ తో 2.0 షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది.

450కోట్ల రూపాయల బడ్జెట్ తో వస్తున్న 2.0 సినిమా కోసం చెన్నై శివార్లలో భారీ సెట్స్ నిర్మించారు. మ్యాగ్జిమమ్ షూటింగ్ అందులోనే చేశారు. మేకింగ్ వీడియోలో చూపించిన చాలా సన్నివేశాలు ఆ సెట్ లోనివే. సినిమా విడుదల తర్వాత కూడా కొన్ని రోజుల పాటు ఆ సెట్ ను అలానే ఉంచబోతున్నారు. 2.0 రిలీజ్ తర్వాత ఆ సెట్ ను ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉంది యూనిట్. మరోవైపు బాహుబలి తరహాలో అదే సెట్ లో ఇంటర్వ్యూలు కూడా ప్లాన్ చేస్తోంది.

2015, డిసెంబర్ 16న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ప్రారంభం కాగా.. 2017, అక్టోబర్ లో సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతోందన్నమాట. అంతకంటే ముందు ఏడాది పాటు ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరిగింది.