సవ్యసాచికి కీరవాణి

సీనియర్ సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్. కీరవాణి చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తారు. బాహుబలి 2 తరువాత మళ్లీ ఆయన ఏ సినిమాకు ఇంతవరకు సైన్ చేయలేదు. ఇప్పుడు ఓ సినిమాకు ఓకె అన్నారు.…

సీనియర్ సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్. కీరవాణి చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తారు. బాహుబలి 2 తరువాత మళ్లీ ఆయన ఏ సినిమాకు ఇంతవరకు సైన్ చేయలేదు. ఇప్పుడు ఓ సినిమాకు ఓకె అన్నారు. నాగ చైతన్యతో మైత్రీ మూవీస్ నిర్మించే సవ్యసాచి సినిమాకు కీరవాణి సంగీతం అందించబోతున్నారు. చందు మొండేటి ఈ సినిమాకు దర్శకుడు.

నాగార్జున కుటుంబంతో మంచి అనుబంధం వున్న రీత్యా కీరవాణి పేరు పరిశీలనలోకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే స్క్రిప్ట్ తెలిస్తేనే కీరవాణి సంగీతం అందంచడానికి ఓకె అంటారు. ఆ మేరకు చందుతో డిస్కషన్లు జరిపిన మీదట సంగీతం అందించడానికి ఓకె అన్నట్లు తెలుస్తోంది. బహుశా రాజమౌళికి దర్శకుడు చందు అంటే వున్న అభిమానం కూడా ఇక్కడ పని చేసినట్లు తెలుస్తోంది.

ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా పాటల్లో వైవిధ్యం అన్నది తక్కువైపోయింది. దేవీ శ్రీ ప్రసాద్, థమన్, గోపీ సుందర్, అనూప్ రూబెన్స్ ఇలా సంగీతం దర్శకుల జాబితా చిన్నదైపోతోంది. అందుకే సీనియర్ల పేర్లు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. మణిశర్మ ఈ మధ్య కాస్త ఎక్కువ సినిమాలే చేస్తున్నారు మళ్లీ. అలాగే కీరవాణి కూడా కాస్త చురుగ్గా, ఎక్కువ సినిమాలు చేస్తే వైవిధ్యమైన పాటలు వినే అవకాశం వస్తుందేమో?