మైత్రీ మూవీస్ బ్యానర్ పై రవితేజ-వైట్ల సినిమా?

భారీ బడ్జెట్ సినిమాలతో పాపులర్ అయింది మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్. ఈమధ్య కాస్త ట్రాక్ మార్చి మీడియం రేంజ్ బడ్జెట్ లో కూడా సినిమాలు ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే నాగచైతన్య-చందు…

భారీ బడ్జెట్ సినిమాలతో పాపులర్ అయింది మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్. ఈమధ్య కాస్త ట్రాక్ మార్చి మీడియం రేంజ్ బడ్జెట్ లో కూడా సినిమాలు ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే నాగచైతన్య-చందు మొండేటి సినిమాను ఫైనలైజ్ చేసిన ఈ బ్యానర్.. ఇప్పుడు రవితేజ-శ్రీనువైట్ల కాంబినేషన్ ను కూడా సెట్ చేసిందట. ఈ మేరకు నిర్మాతలు-హీరో-దర్శకుడి మధ్య ఓ అవగాహన కుదిరింది.

వరుసపెట్టి ఫ్లాపులిచ్చాడు శ్రీనువైట్ల. అటు రవితేజ కూడా పెద్ద హిట్ కోసం స్ట్రగుల్ అవుతున్నాడు. ఇలాంటి ఇద్దరు వ్యక్తుల్ని నమ్ముకొని మైత్రీ మూవీస్ సంస్థ సినిమా ఫైనలైజ్ చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. ఈ సినిమాను అత్యంత లో-బడ్జెట్ లో ప్లాన్ చేసిందట ఈ సంస్థ. ఇంకా చెప్పాలంటే ఇటు రవితేజ, అటు శ్రీనువైట్లకు రెమ్యూనరేషన్ కూడా ఇవ్వట్లేదట.

కేవలం ప్రొడక్షన్ కాస్ట్ మాత్రమే పెట్టి సినిమాను విడుదల చేసి, వచ్చిన లాభాల్ని షేర్ చేసుకునే ఒప్పందంపై ప్రాజెక్టు ఓకే అయినట్టు తెలుస్తోంది. గతంలో రవితేజ-వైట్ల కాంబినేషన్ లో వెంకీ, దుబాయ్ శ్రీను లాంటి హిట్స్ వచ్చాయి. మరి ఈసారి ఆ మేజిక్ రిపీట్ అవుతుందా అనేది చూడాలి.