పారితోషికం పెంచిందట.. అందుకే తీసేశారు

లావణ్య త్రిపాఠి రెమ్యూనరేష్ పెరిగిందట. అందుకే విజయ్ దేవరకొండ కొత్త సినిమా నుంచి ఆమెను తప్పించారట. ప్రస్తుతం టాలీవుడ్ లో నడుస్తున్న టాక్ ఇది. పరశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా జీఏ-2 పిక్చర్స్…

లావణ్య త్రిపాఠి రెమ్యూనరేష్ పెరిగిందట. అందుకే విజయ్ దేవరకొండ కొత్త సినిమా నుంచి ఆమెను తప్పించారట. ప్రస్తుతం టాలీవుడ్ లో నడుస్తున్న టాక్ ఇది. పరశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా జీఏ-2 పిక్చర్స్ బ్యానర్ పై త్వరలోనే సెట్స్ పైకి రానున్న సినిమాలో మొదట లావణ్య త్రిపాఠిని హీరోయిన్ గా అనుకున్నారు. అయితే ఆమె స్థానంలో ఇప్పుడు కన్నడ బ్యూటీ రష్మికను తీసుకున్నారు.

రెమ్యూనరేషన్ ఎక్కువగా డిమాండ్ చేయడం వల్లనే లావణ్యను తప్పించినట్టు తెరవెనక ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అటు నిర్మాత అల్లు అరవింద్ కానీ, ఇటు లావణ్య కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. కొత్తగా ఎంపికైన రష్మిక మాత్రం.. తను ఈ సినిమాలో నటించబోతున్నట్టు ట్వీట్ చేసింది.

ప్రస్తుతం లావణ్య చేతిలో 2 తెలుగు సినిమాలున్నాయి. నాగచైతన్యతో యుద్ధం శరణం సినిమా చేసిన ఈ చిన్నది.. రామ్ హీరోగా నటిస్తున్న ఉన్నది ఒక్కటే జిందగీ సినిమాలో నటిస్తోంది. వీటితో పాటు త్వరలోనే ఓ తమిళ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలో ఉంది లావణ్య.