రాంగ్ సిగ్నళ్లు ఇస్తున్న బాబీ?

జై లవకుశ విషయంలో అసలే బజ్ అంతంత మాత్రంగా వుందన్నది వాస్తవం. జై క్యారెక్టర్ టీజర్ బయటకు వచ్చినపుడు భయంకరమైన బజ్ వచ్చింది. కానీ అదే బజ్, లవ, కుశ క్యారెక్టర్లు రివీల్ చేసినపుడు…

జై లవకుశ విషయంలో అసలే బజ్ అంతంత మాత్రంగా వుందన్నది వాస్తవం. జై క్యారెక్టర్ టీజర్ బయటకు వచ్చినపుడు భయంకరమైన బజ్ వచ్చింది. కానీ అదే బజ్, లవ, కుశ క్యారెక్టర్లు రివీల్ చేసినపుడు రాలేదు. లవ క్యారెక్టర్ టీజర్ జస్ట్ ఓకె అనుకున్నారు. కుశ లుక్ పెద్దగా ఆకట్టుకోలేదు. టీజర్ ఎలా వుంటుందో ఇంకా తెలియదు. టోటల్ గా జై లవకుశ సినిమాకు ఎన్టీఆర్ పెద్ద అసెట్ అయితే డైరక్టర్ బాబీ అంత డెబిట్ అన్నది ఇండస్ట్రీ టాక్.

ఇలాంటి టైమ్ లో డైరక్టర్ బాబీ వెళ్లి అల్లు అర్జున్ ను కలిసారని, కథ చెప్పారని, తరువాతి ప్రాజెక్టు ఓకె చేయించుకున్నారని వార్తలు బయటకు పొక్కాయి. నిజానికి బాబీ తన కథను బన్నీకి చెప్పింది జై లవకుశ ప్రాజెక్టుకు ముందే. కానీ అప్పట్లో ఎస్, నో అన్న సిగ్నల్ ఏదీ బన్నీ దగ్గర నుంచి రాలేదు.

అలాగే ఇప్పుడు కూడా బన్నీ తన తరువాతి ప్రాజెక్టును ఫిక్సయిపోయి వున్నాడు. అది లింగుస్వామితో వుంటుంది. ఇంకో పక్క జైలవకుశ పనులు ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ఇలాంటి టైమ్ లో సినిమా డైరక్టర్ కు ఊపిరి సలపదు. అలాంటి నేపథ్యంలో బాబీ వెళ్లి కలిసారా? అన్నది ఫస్ట్ క్వశ్చను. అలా కలిస్తే అసలు ఎందుకు ఈ టైమ్ లో కలిసినట్లు అన్నది రెండో క్వశ్చను.

సాధారణంగా ఓ నిర్మాత తన పెద్ద సినిమా విడుదల ముందు మరో ప్రాజెక్టుకు అర్జెంట్ గా క్లాప్ కొట్టించినా, లేదా ఓ డైరక్టర్ తన పెద్ద సినిమా విడుదల ముందు అర్జెంట్ గా మరో ప్రాజెక్టు సెట్ చేసుకునే పనిలో పడినా ఇండస్ట్రీలోకి రాంగ్ సిగ్నళ్లు వెళ్తాయి. దీపం వుండగానే ఇల్లు చక్క బెట్టేసుకుంటున్నారన్న ఫీలర్లు వెళ్తాయి. బాబీ-బన్నీ ఫీలర్లు బాబీ వైపు నుంచే బయటకు వచ్చాయని, ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే ఎందుకు వచ్చినట్లు అన్న అనుమానాలు వస్తాయి.

ఏదైనా సరే, జై లవకుశ యూనిట్ ఈ విషయంలో కాస్త జాగ్రత్త పడడం అవసరమేమో?