టీడీపీ ఎమ్మెల్యే ఇంటికి వెంకయ్యనాయుడు…!

మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు విశాఖ టీడీపీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళడం జరిగింది. విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే పి గణబాబు ఇంటికి ఆయన వెళ్ళి బ్రేక్ ఫాస్ట్ చేశారు. మాజీ ఉప రాష్ట్రపతి…

మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు విశాఖ టీడీపీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళడం జరిగింది. విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే పి గణబాబు ఇంటికి ఆయన వెళ్ళి బ్రేక్ ఫాస్ట్ చేశారు. మాజీ ఉప రాష్ట్రపతి అక్కడ ఉండడంతో మాజీ మంత్రులు టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు ఆయనను గణబాబు ఇంట్లో కలిశారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యేలు పీలా గోవింద్, గండి బాబ్జీ వెంకయ్యనాయుడుతో కలసి బ్రేక్ ఫాస్ట్ చేశారు. విశాఖకు తరచూ వెంకయ్యనాయుడు వస్తూంటారు. ఆయనను పలువురు ప్రముఖులు కలుస్తూ ఉంటారు. వెంకయ్యనాయుడు టీడీపీ ఎమ్మెల్యే ఇంటికి ఎందుకు వెళ్లారన్నది తెలియరాలేదు కానీ టీడీపీకి చెందిన కీలక నేతలు అంతా ఆయనతో కలసి మాట్లాడిన వైనం మాత్రం ఆసక్తిని కలిగిస్తోంది.

ఉప రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన తరువాత దేశం బాగుండాలని రాజకీయాలలో శతృ ధోరణులు లేకుండా పోవాలని, మంచి అభ్యర్ధులను కుల మత ప్రాంతాలకు అతీతంగా ప్రజలు ఎన్నుకోవాలని వెంకయ్యనాయుడు వివిధ సభలలో చెబుతూ వస్తున్నారు.

ఆయన ప్రజలను చైతన్యం చేస్తూనే రాజకీయ నేతలనూ చేస్తున్నారు. పెద్దాయనగా ఆయన మాటలను అన్ని పార్టీలు గౌరవిస్తాయి. వెంకయ్యనాయుడు టీడీపీ తమ్ముళ్లకు మంచి విషయాలే హిత బోధ చేసి ఉంటారని అంతా అంటున్నారు.