రోజులో ఒక్క గంట చాలు – రకుల్ ప్రీత్

ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లో హాట్ టాపిక్ మారింది రకుల్ ప్రీత్. దీనికి కారణం అందరికీ తెలిసిందే. ప్రియుడు జాకీ భగ్నానీని ఆమె వచ్చే నెలలో పెళ్లి చేసుకోబోతోందనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.…

ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లో హాట్ టాపిక్ మారింది రకుల్ ప్రీత్. దీనికి కారణం అందరికీ తెలిసిందే. ప్రియుడు జాకీ భగ్నానీని ఆమె వచ్చే నెలలో పెళ్లి చేసుకోబోతోందనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. వీటికి మరింత ఊతమిస్తూ, ఆమె జాకీతో కలిసి దేవాలయాలు సందర్శిస్తోంది, ప్రత్యేక పూజలు చేస్తోంది.

తాజాగా బాలీవుడ్ మీడియాతో మాట్లాడింది రకుల్. పెళ్లి పుకార్లను తేలిగ్గా తీసుకున్న ఈ బ్యూటీ, ఎక్కువ కాలం సింగిల్ గా ఉన్న హీరోయిన్ ను తానే అంటూ ప్రకటించుకుంది. ఈ సందర్భంగా జాకీతో తన అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకుంది. తామిద్దరం రోజుకు ఒక గంట మాత్రమే గడుపుతామని తెలిపింది.

“మేమిద్దరం పని రాక్షసులం. రోజుకు 12 గంటలు పని చేస్తాం. ఇంటికొచ్చిన తర్వాత ఒక గంట మాత్రమే కలిసుంటాం. ఆ గంట మాకు చాలా ప్రత్యేకమైంది. ఆ టైమ్ లో చాలా విషయాలు మాట్లాడుకుంటాం. అయితే మా వృత్తి గురించి మాత్రం ఆ టైమ్ లో మాట్లాడుకోం.”

సినిమాల గురించి కాకుండా మాట్లాడుకోవడానికి తామిద్దరి మధ్య చాలా టాపిక్స్ ఉన్నాయంటోంది రకుల్, తను, జాకీ ఫిట్ నెస్ ను ఇష్టపడతామని, ఎక్కువగా వర్కవుట్స్ గురించి మాట్లాడుకుంటామని తెలిపింది. దీంతో పాటు, ఆరోగ్యం, ఫుడ్ గురించి ఎక్కువగా చర్చించుకుంటామని తెలిపింది.