టీడీపీకి షాక్ ఇచ్చేలా జ‌న‌సేన ప్లెక్సీలు!

ఎన్నిక‌ల‌కు వైసీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ స‌మ‌ర శంఖాన్ని పూరించారు. సిద్ధం అనే నినాదంతో వైసీపీ స‌మ‌రోత్సాహాన్ని ప్ర‌ద‌ర్శిస్తోంది. ఊరూరా సిద్ధం పోస్ట‌ర్లు ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి. జ‌గ‌న్ పెద్ద ఫొటోతో కూడిన సిద్ధం నినాదం…

ఎన్నిక‌ల‌కు వైసీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ స‌మ‌ర శంఖాన్ని పూరించారు. సిద్ధం అనే నినాదంతో వైసీపీ స‌మ‌రోత్సాహాన్ని ప్ర‌ద‌ర్శిస్తోంది. ఊరూరా సిద్ధం పోస్ట‌ర్లు ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి. జ‌గ‌న్ పెద్ద ఫొటోతో కూడిన సిద్ధం నినాదం ప్ర‌జానీకాన్ని ఆక‌ట్టుకుంటోంది. ఇటీవ‌ల భీమిలిలో నిర్వ‌హించిన వైసీపీ ఎన్నిక‌ల శంఖారావం స‌భ సూప‌ర్ స‌క్సెస్ అయ్యింది.

ఒక్క‌సారిగా వైసీపీ శ్రేణులు ఎన్నిక‌ల స‌మ‌రానికి రెట్టించిన ఉత్సాహంతో సిద్ధ‌మ‌వుతున్నాయి. వైఎస్ జ‌గ‌న్ ప్ర‌సంగం వైసీపీ శ్రేణుల్లో ప్ర‌త్య‌ర్థుల‌ను మ‌ట్టి క‌రిపించాల‌న్న ప‌ట్టుద‌ల పెంచింది. ఎలాగైనా మ‌ళ్లీ అధికారంలోకి రావాల‌న్న ఆశ‌యాన్ని బ‌లోపేతం చేయ‌డంలో జ‌గ‌న్ స‌క్సెస్ అయ్యారు.

వైసీపీ సిద్ధం అంటూ ప్ర‌త్య‌ర్థుల‌కు విసిరిన స‌వాల్‌కు కౌంట‌ర్‌గా… జ‌న‌సేన స్పందించ‌డం విశేషం. మేము సిద్ధం అంటూ జ‌న‌సేన ప్లెక్సీల‌ను వైసీపీకి దీటుగా తెర‌పైకి తెచ్చింది. ఇందులో కాపు ఆరాధ్య దైవం వంగ‌వీటి మోహ‌న్‌రంగా ఫొటో ప్ర‌చురించ‌డం గ‌మ‌నార్హం. అలాగే ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఫొటోను హైలెట్ చేయ‌డం విశేషం. జ‌న‌సేన ప్ర‌చారం చేస్తున్న మేము సిద్ధం పోస్ట‌ర్‌లో చంద్ర‌బాబు, లోకేశ్ ఫొటోల‌కు స్థానం ద‌క్క‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

వైసీపీని ఢీకొట్టే పార్టీ జ‌న‌సేన మాత్ర‌మే అని ఆ పార్టీ నేత‌లు ప్ర‌చారం చేసుకుంటున్నారు. పొత్తుపై నీలి నీడ‌లు క‌మ్ముకున్న నేప‌థ్యంలో మేము సిద్ధం అంటూ జ‌న‌సేన ఒంటెత్తు పోక‌డ‌లతో వ్య‌వ‌హ‌రించ‌డం టీడీపీకి తీవ్ర ఆగ్ర‌హాన్ని తెప్పిస్తోంది. ఈ ప‌రిణామాల్ని టీడీపీ, జ‌న‌సేన అధినేత‌లు ఎలా తీసుకుంటారో చూడాలి.