బాబుకు ప‌వ‌న్ కౌంట‌ర్‌.. రెండు స్థానాలు ప్ర‌క‌ట‌న‌!

టీడీపీ- జనసేన పార్టీలు పొత్తులో ఉన్నా కూడా జనసేనను లెక్కలోకి తీసుకోకుండా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండు నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థుల‌ను ప్రకటించడంతో పవన్ కళ్యాణ్ హార్ట్ అయినట్టు ఉన్నారు. అందుకే…

టీడీపీ- జనసేన పార్టీలు పొత్తులో ఉన్నా కూడా జనసేనను లెక్కలోకి తీసుకోకుండా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండు నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థుల‌ను ప్రకటించడంతో పవన్ కళ్యాణ్ హార్ట్ అయినట్టు ఉన్నారు. అందుకే తాజాగా ఆయన కూడా తమ పార్టీ నుంచి రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు.

ఇవాళ ఆయ‌న మాట్లాడుతూ..  “మండ‌పేట‌, అర‌కు అభ్య‌ర్థుల‌ను టీడీపీ ఏక‌ప‌క్షంగా ప్ర‌క‌టించ‌డం పొత్త ధ‌ర్మం కాదని. టీడీపీ రెండు సీట్లు ప్ర‌కటించింది కాబ‌ట్టి మేము కూడా రెండు సీట్ల‌ను ప్ర‌క‌టిస్తున్నాం అంటూ రాజోలు, రాజాన‌గ‌రంలో జ‌న‌సేన పోటీ చేస్తుందని” ప్ర‌క‌టించారు”.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏకపక్షంగా అభ్యర్థుల్ని ప్రకటించడాన్ని తప్పుబ‌డుతూ.. టీడీపీ అభ్యర్థుల ప్రకటనపై బాబు పొత్తు ధర్మం పాటించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే పొత్తుల్లో ఒక మాట అటూ ఇటూ ఉంటుందని.. అయినా కూడా ఎన్నిక‌ల‌కు క‌లిసే వెళ్తాం అన్నారు. టీడీపీ అభ్య‌ర్ధుల ప్ర‌క‌ట‌నతో జ‌న‌సేన‌లో ఆందోళ‌న చెల‌రేగింద‌ని దీనికి జ‌న‌సేన నేత‌ల‌కు క్ష‌మాప‌ణాలు అడిగారు.

కాగా ఇప్ప‌టికే సీట్లు, నియోజ‌క‌వ‌ర్గాల పేరుతో త‌మ‌ను జ‌న‌సేన‌ బ్లాక్ మెయిల్ చేస్తోంద‌ని టీడీపీ నేత‌లు తీవ్ర ఆగ్ర‌హంగా ఉన్నారు. ఇంత‌లోనే ఇవాళ ప‌వ‌న్ తాజా ప్ర‌క‌ట‌న‌పై టీడీపీ నుండి ఎటువంటి స్పంద‌న వ‌స్తుందో చూడాలి