టీవీ యాంకర్ ను కిడ్నాప్ చేసిన త్రిష

హైదరాబాద్ లో కిడ్నాప్ ఘటన చోటుచేసుకుంది. ఓ అబ్బాయిపై మనసుపడిన అమ్మాయి, అతడ్ని కిడ్నాప్ చేయించింది. పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టింది. ఇక్కడ అబ్బాయి టీవీ యాంకర్ అయితే, అమ్మాయి కోటీశ్వరురాలు. Advertisement హైటెక్…

హైదరాబాద్ లో కిడ్నాప్ ఘటన చోటుచేసుకుంది. ఓ అబ్బాయిపై మనసుపడిన అమ్మాయి, అతడ్ని కిడ్నాప్ చేయించింది. పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టింది. ఇక్కడ అబ్బాయి టీవీ యాంకర్ అయితే, అమ్మాయి కోటీశ్వరురాలు.

హైటెక్ సిటీలో డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ నడుపుతోంది త్రిష. ఆమెకు ఓ 5 స్టార్టప్ కంపెనీలు కూడా ఉన్నాయి. వాటి ద్వారా కోట్లలో సంపాదిస్తోంది. అనుకోకుండా ఓ మ్యాట్రిమోనీ సైట్ లో ప్రణవ్ ను చూసింది. ఓ టీవీ ఛానెల్ లో యాంకర్ గా చేస్తున్నాడు ప్రణవ్.

ప్రణవ్ అందచందాలు చూసి ఫ్లాట్ అయిన త్రిష, వెంటనే సైట్ లో అతడ్ని సంప్రదించింది. అయితే అది నకిలీ ప్రొఫైల్. ఈ విషయాన్ని ఇట్టే గ్రహించిన ఆమె, ఎలాగోలా ప్రణవ్ వివరాలు తెలుసుకొని, అతడ్ని హెచ్చరించింది.

త్రిష చేసిన సహాయానికి ప్రణవ్ థ్యాంక్స్ చెప్పాడు. అక్కడితో అయిపోయిందనుకున్నాడు. కానీ త్రిష మాత్రం ప్రణవ్ ను వదల్లేదు. పెళ్లి చేసుకుందామంటూ వెంటపడింది. ఎప్పటికీ ప్రణవ్ ఒప్పుకోకపోవడంతో ఇక కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకుంది.

ఓ గ్యాంగ్ కు సుపారీ ఇచ్చి మరీ ప్రణవ్ ను కిడ్నాప్ చేయించి తన ఇంట్లో పెట్టుకుంది. ఒకటి కాదు, రెండు కాదు, 10 రోజుల పాటు అతడ్ని ఇంట్లోనే బంధించి పెళ్లి చేసుకోమని వేధించింది.

ఎలాగోలా బయటపడిన ప్రణవ్, నేరుగా వెళ్లి పోలీసుల్ని ఆశ్రయించాడు. త్రిషను అదుపులోకి తీసుకున్న పోలీసులు, మిగతా గ్యాంగ్ సభ్యుల కోసం గాలిస్తున్నారు.