పెళ్లి తర్వాత ‘ప్రేమికుల రోజు’ ఎలా గడిచింది?

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కొన్నేళ్ల పాటు ప్రేమించుకున్నారు. ఇద్దరూ ఒకర్ని విడిచి ఒకరు ఉండలేనంత దగ్గరయ్యారు. దీంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. రీసెంట్ గా ఈ జంట వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. Advertisement…

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కొన్నేళ్ల పాటు ప్రేమించుకున్నారు. ఇద్దరూ ఒకర్ని విడిచి ఒకరు ఉండలేనంత దగ్గరయ్యారు. దీంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. రీసెంట్ గా ఈ జంట వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది.

పెళ్లికి ముందు వీళ్లిద్దరూ కొన్ని వాలంటైన్స్ డేలు సెలబ్రేట్ చేసుకొని ఉంటారు. మరి పెళ్లి తర్వాత వచ్చిన తొలి ప్రేమికుల రోజును వరుణ్-లావణ్య ఎలా జరుపుకున్నారు?

“ఈ వాలంటైన్స్ డేకి లావణ్యకు నేను ఎలాంటి గిఫ్ట్ ఇవ్వలేదు. తను కూడా నాకు ఏ గిఫ్ట్ ఇవ్వలేదు. కాకపోతే ఇద్దరం కలిసి అలా షికారుకు వెళ్లొచ్చాం. మంచు కొండల్లో విహరించాం.”

ఇలా పెళ్లి తర్వాత ప్రేమికుల రోజును మంచు కొండల్లో సెలబ్రేట్ చేసుకున్నట్టు వెల్లడించాడు వరుణ్ తేజ్. పెళ్లికి ముందు మాత్రం లావణ్యకు గిఫ్టులు ఇచ్చానని తెలిపిన ఈ హీరో, కాలేజ్ డేస్ లో కూడా చాలామందికి బహుమతులు ఇచ్చానని అన్నాడు.

తను 6 అడుగులున్నప్పటికీ, అందంగా కనిపించినప్పటికీ కాలేజ్ లైఫ్ లో అమ్మాయిలెవ్వరూ తనకు బహుమతులివ్వలేదని, తనే చాలామందికి ఇచ్చానని చెప్పుకొచ్చాడు.

ఈ హీరో నటించిన తాజా చిత్రం ఆపరేషన్ వాలంటైన్. మార్చి 1న విడుదలకానున్న ఈ సినిమా కోసం గట్టిగా ప్రచారం చేస్తున్నాడు వరుణ్ తేజ్. ఈ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు.