భార్య‌తో క‌లిసి ప‌వ‌న్‌.. ఫొటోలు వైర‌ల్‌!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ వివాహ జీవితంపై తీవ్ర‌మైన విమ‌ర్శ‌లున్న సంగ‌తి తెలిసిందే. రేణుదేశాయ్‌కి విడాకులు ఇచ్చిన త‌ర్వాత ర‌ష్యా న‌టి అన్నా లెజొనోవాను మూడో వివాహం చేసుకున్నారు. ప‌దేప‌దే భార్య‌ల్ని మారుస్తార‌ని ప‌వ‌న్‌పై ప్ర‌త్య‌ర్థులు రాజ‌కీయ…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ వివాహ జీవితంపై తీవ్ర‌మైన విమ‌ర్శ‌లున్న సంగ‌తి తెలిసిందే. రేణుదేశాయ్‌కి విడాకులు ఇచ్చిన త‌ర్వాత ర‌ష్యా న‌టి అన్నా లెజొనోవాను మూడో వివాహం చేసుకున్నారు. ప‌దేప‌దే భార్య‌ల్ని మారుస్తార‌ని ప‌వ‌న్‌పై ప్ర‌త్య‌ర్థులు రాజ‌కీయ కోణంలో విమ‌ర్శిస్తుండ‌డం తెలిసిందే. అయితే మూడో భార్య‌కు కూడా విడాకులు ఇచ్చార‌ని విస్తృతంగా ప్ర‌చార‌మ‌వుతున్న నేప‌థ్యంలో, ఆమెతో క‌లిసి ప‌వ‌న్ క‌నిపించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఇటలీకి త‌న భార్య అన్నా లెజొనోవాతో క‌లిసి ప‌వ‌న్ వెళుతూ హైద‌రాబాద్ విమానాశ్ర‌యంలో కెమెరాల‌కు చిక్కారు. భార్యాభ‌ర్త‌లిద్ద‌రి ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. త‌న అన్న నాగ‌బాబు కుమారుడు, యువ హీరో వ‌రుణ్‌తేజ్‌, న‌టి లావ‌ణ్య త్రిపాఠి వివాహం న‌వంబ‌ర్ 1న ఇట‌లీలో నిర్వ‌హించ‌త‌ల‌పెట్టారు. అంత‌కు ముందు వీళ్లిద్ద‌రి నిశ్చితార్థం హైద‌రాబాద్‌లో నాగ‌బాబు ఇంట్లో జ‌రిగింది. నిశ్చితార్థానికి ప‌వ‌న్ ఒక్క‌డే హాజ‌రు కావ‌డంతో ర‌క‌ర‌కాల వార్త‌లు వెల్లువెత్తాయి.

ఇట‌లీలో జ‌రుగుతున్న వివాహానికి ప‌వ‌న్ హాజ‌రుకార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. భార్య‌తో క‌లిసి వెళ్ల‌క‌పోతే విడాకుల వార్త‌ల్ని నిజం చేసిన‌ట్టు అవుతుంద‌ని, అందుకే ఎన్నిక‌ల స‌మ‌యంలో అలాంటి ప్ర‌చారానికి అవ‌కాశం లేకుండా పెళ్లికే వెళ్ల‌ర‌నే ప్ర‌చారం సాగింది. 

అలాంటి ప్ర‌చారానికి ఫుల్‌స్టాప్ పెడుతూ త‌న భార్య‌తో క‌లిసి ఇట‌లీకి ప‌వ‌న్ ప్ర‌యాణం కావ‌డం విశేషం. మ‌రోవైపు వ‌ధూవ‌రులిద్ద‌రూ ఇప్ప‌టికే ఇట‌లీకి చేరుకున్నారు. మెగా కుటుంబ స‌భ్యులంతా వివాహ స‌మ‌యానికి అక్క‌డికి చేరుకోనున్నారు.