భార్య ఎదుటే భ‌ర్త న‌రికివేత‌!

అన్న‌మ‌య్య జిల్లా మ‌ద‌న‌ప‌ల్లెలో దారుణం చోటు చేసుకుంది. మ‌ద‌న‌ప‌ల్లె ప‌ట్ట‌ణంలోని శ్రీ‌వారి న‌గ‌ర్‌లో శ‌నివారం తెల్ల‌వారుజామున ఓ యువ‌కుడిని దుండ‌గులు దారుణంగా న‌రికి చంపారు. పోలీసుల క‌థ‌నం మేర‌కు వివ‌రాలిలా ఉన్నాయి. Advertisement దందాల‌కు…

అన్న‌మ‌య్య జిల్లా మ‌ద‌న‌ప‌ల్లెలో దారుణం చోటు చేసుకుంది. మ‌ద‌న‌ప‌ల్లె ప‌ట్ట‌ణంలోని శ్రీ‌వారి న‌గ‌ర్‌లో శ‌నివారం తెల్ల‌వారుజామున ఓ యువ‌కుడిని దుండ‌గులు దారుణంగా న‌రికి చంపారు. పోలీసుల క‌థ‌నం మేర‌కు వివ‌రాలిలా ఉన్నాయి.

దందాల‌కు పాల్ప‌డే 20 మంది ముఠా శ్రీ‌వారిన‌గ‌ర్‌లో వుంటున్న పుంగ‌నూరు శేషు (25) అనే యువ‌కుడి ఇంటికెళ్లింది. గేటు బీగాల్ని ఆ ముఠా ప‌గ‌ల‌గొట్టింది. అనంత‌రం ఇంటి త‌లుపులు ధ్వంసం చేసి, ఇంట్లో నిద్రిస్తున్న శేషుపై క‌త్తులు, వేట‌కొడ‌వ‌ళ్ల‌తో దాడికి ఆ ముఠా స‌భ్యులు పాల్ప‌డ్డారు. భార్య ఎదుటే దారుణానికి పాల్ప‌డ్డారు. దుండ‌గుల దాడిలో ఆ యువ‌కుడు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయాడు.

ఈ ఘ‌ట‌న‌తో మద‌న‌ప‌ల్లె ఉలిక్కిప‌డింది. ప‌ట్ట‌ణ‌వాసులు పెద్ద సంఖ్య‌లో సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్నారు. డీఎస్పీ ప్ర‌సాద్‌రెడ్డి నేతృత్వంలో పోలీసులు ద‌ర్యాప్తు మొద‌లు పెట్టారు. మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మ‌ద‌న‌ప‌ల్లె జిల్లా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. దోపిడీ నిమిత్తం వెళ్లి హ‌త్య‌కు పాల్ప‌డ్డారా? లేక ఇత‌రేత‌ర కార‌ణాలు ఏవైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. అంతా ఎన్నిక‌లు, కౌంటింగ్ మూడ్‌లో ఉండ‌గా, యువ‌కుడి హ‌త్య జ‌ర‌గ‌డం మ‌ద‌న‌ప‌ల్లెలో ఆందోళ‌న క‌లిగిస్తోంది.