రాజ్ తరుణ్ తో డేటింగ్ చేయడం లేదంట

హీరోయిన్ మాల్వీ మల్హోత్రా తన ప్రియుడు రాజ్ తరుణ్ ను బుట్టలో వేసుకుందని, రాజ్ ను తనకు అప్పగించాలని, లావణ్య అనే మహిళ పోలీసుల్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 11 ఏళ్లు రాజ్ తో…

హీరోయిన్ మాల్వీ మల్హోత్రా తన ప్రియుడు రాజ్ తరుణ్ ను బుట్టలో వేసుకుందని, రాజ్ ను తనకు అప్పగించాలని, లావణ్య అనే మహిళ పోలీసుల్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 11 ఏళ్లు రాజ్ తో తను సహజీవనం చేస్తుంటే, మాల్వి వచ్చి తన ప్రియుడ్ని ఎగరేసుకుపోయిందని ఆరోపించింది.

ఈ వివాదంపై రాజ్ తరుణ్ విస్పష్ట ప్రకటన చేశాడు. తనకు లావణ్యకు ఎలాంటి శారీరక సంబంధం లేదని తెలిపాడు. ఆమె డ్రగ్స్ కు బానిసైన తర్వాత దూరం పెట్టానని అన్నాడు. ఇప్పుడీ వివాదానికి కేంద్ర బిందువైన హీరోయిన్ మాల్వి మల్హోత్రా కూడా స్పందించింది.

“గతేడాది ఆగస్ట్-సెప్టెంబర్ లో నాకు లావణ్య ఫోన్ చేసింది. రాజ్ తో మాట్లాడొద్దని వార్నింగ్ ఇచ్చింది. నేను రాజ్ తో చెప్పాను. అతడు నంబర్ బ్లాక్ చేయమని చెప్పాడు. అప్పుడు లావణ్య నా తల్లిదండ్రులకు ఫోన్ చేసి బెదిరించింది. వాళ్ల నంబర్లు లావణ్యకు ఎలా దొరికాయో నాకు అర్థం కావడంలేదు. ఇలాంటి టెన్షన్లు నాకు వద్దు. ఇదే విషయం రాజ్ తో చెప్పాను. 6 నెలల నుంచి మేం మాట్లాడ్డం లేదు. ఇప్పుడు మళ్లీ మూవీ ప్రమోషన్ కోసం కలిశామంతే.”

లావణ్య ఆరోపిస్తున్నట్టు రాజ్ తరుణ్ తో తనకు ఎలాంటి రిలేషన్ షిప్ లేదంటోంది మాల్వి. తను రాజ్ తో డేటింగ్ చేయడం లేదని స్పష్టం చేసింది.

“రాజ్ తరుణ్ నా సహ-నటుడు మాత్రమే. మేం సినిమాల గురించి తప్ప ఇంకే మాట్లాడుకోం. మా ఇద్దరి మధ్య అంతకుమించి ఎలాంటి రిలేషన్ షిప్ లేదు.”

లావణ్య తనను ఎందుకు టార్గెట్ చేస్తుందో అర్థం కావడం లేదంటోంది మాల్వి. తను కనిపిస్తే ఇదే ప్రశ్న అడుగుతానంటోంది. ఇలాంటి టెన్షన్లు పడడం తనకు ఎంతమాత్రం ఇష్టం లేదని, అయితే తన కుటుంబ సభ్యులపై మాటలతో దాడిచేసిన లావణ్యపై మాత్రం లీగల్ గా ప్రొసీడ్ అవుతానని, సాక్ష్యాలన్నీ ఉన్నాయని అంటోంది మాల్వీ మల్హోత్రా.