అప్పలకొండ: ఒరేయ్ జోగి! స్టీల్ ప్లాంటు గొడవంట ఏంట్రా?
జోగినాధం: పేపర్ చదవ్వేంట్రా?! ప్రతీదీ నన్నడుగుతావు!
అప్పలకొండ: నువ్వుంటే పేపర్లెందుకెహె!!
జోగినాధం: ఏముందీ…కేంద్రం వాళ్లు ప్రైవేట్ చేసేస్తారంటా..
అప్పలకొండ: వార్నీ…మరి మన జగన్ బాబు ఏం చేత్తనాడు?
జోగినాధం: ఆలోచన విరమించుకోమని ప్రధాన మంత్రికి ఉత్తరం రాసాడు.
అప్పలకొండ: ఉత్తర దిక్కుకి ఉత్తరం రాస్తే ఫలితం ఉండదురా…తూర్పు తిరిగి దండం పెట్టమంటారు..ఆళ్లేమీ పట్టించుకోరు.
జోగినాధం: అబ్బో చాలా తెలుసురా నీకు! మరేం చెయ్యాలంటావ్?
అప్పలకొండ: గొడవ చెయ్యాలి…పార్టీలు పక్కనపెట్టి ఆంధ్రావోడి ఆస్తి కోసం ఆంధ్రనాయకులంతా పోరాడాలి.
జోగినాధం: అందరూ అదే కోరుకుంటున్నారు…ముఖ్యమంత్రి ముందస్తుగా లెటర్ రాసాడు..కానీ ఒక నాయుడు సగం మాట్లాడి కూచున్నాడు. ఇంకొక నాయుడు ఇంకా నోరు మెదపలేదు.
అప్పలకొండ: ఎవరాళ్లు?
జోగినాధం: మన చంద్రబాబు నాయుడు ప్రెస్ మీటు ఒకటి పెట్టి షరా మామూలుగా జగన్ ని తిట్టి సైలెంట్ అయిపోయాడు. మోడిని ఒక్క మాటనలేదు. ఇక పవన్ నాయుడు ఈ టాపిక్ మీద మౌనవ్రతంలో ఉన్నాడు.
అప్పలకొండ: అమ్మనీ..నాయుళ్ళిద్దరూ ఈ సమయంలో కూడా రాజకీయమంటే ఎట్టారా? ఇప్పుడు కూడా జగన్ మీదేనా కోపం?
జోగినాధం: జగన్ మీదం కోపం కాదురా…మోడి అంటే భయం. తడిసిపోతున్నట్టుంది ఇద్దరికీ..ఒక్క మాట మోడీకి వ్యతిరేకంగా మాట్లాడాలంటే.
అప్పలకొండ: అంతేనంటావా?
జోగినాధం: లేకపోతే ఏంట్రా? ఈ సైలెన్సుని ఏమనుకోవాలి?