సడెన్ గా విశాఖకు జగన్…ఆయనతో భేటీ…?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నెల తేడాలో మరోసారి విశాఖ వస్తున్నారు. ఈసారి కూడా ఆయన కొద్ది గంటల సేపు మాత్రమే సిటీలో గడపనున్నారు. అధికారిక కార్యక్రమాలేవీ ఈ టూర్ లో లేవు. అయితే చిత్రంగా…

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నెల తేడాలో మరోసారి విశాఖ వస్తున్నారు. ఈసారి కూడా ఆయన కొద్ది గంటల సేపు మాత్రమే సిటీలో గడపనున్నారు. అధికారిక కార్యక్రమాలేవీ ఈ టూర్ లో లేవు. అయితే చిత్రంగా ఆయన హర్యానాకు చెందిన బీజేపీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో భేటీ అవుతారు అని తెలుస్తోంది.

ఈ మేరకు ఈ నెల 19న ముఖ్యమంత్రి జగన్ టూర్ ఖరారు అయింది. ఇక ముఖ్యమంత్రి ఉదయం పదకొండు గంటలకు విశాఖకు చేరుకుంటారు. ఆ తరువాత ఆయన నేరుగా బీచ్ రోడ్డులోని  రుషికొండలో ఉన్న ప్రేమ వెల్ నెస్ రిసార్ట్స్ లో విడిది చేసిన హర్యానా ముఖ్యమంత్రితో భేటీ అవుతారు.

ఈ సమావేశం దాదాపుగా గంట పాటు సాగనుంది. అనంతరం ముఖ్యమంత్రి నేరుగా ఎయిర్ పోర్టుకు వచ్చి విజయవాడ పయనం అవుతారు. మరి ముఖ్యమంత్రి సడెన్ గా విశాఖ టూర్ పెట్టుకోవడం, బీజేపీ ముఖ్యమంత్రితో సమావేశం కావడం మాత్రం విశేషం అనే చెప్పాలి.

ఇక విషయనికి వస్తే హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ గత కొద్ది రోజులుగా బీచ్ రోడ్డులోని రుషికొండ ప్రేమ వెల్ నెస్ సెంటర్ లో ఉంటున్నారు. ఆయన చికిత్స నిమిత్తం విశాఖకు వచ్చారని, ఈ నెల 20న తిరిగి హర్యానా వెళ్తారని తెలుస్తోంది. 

ఇక హర్యానా సీఎం తాజాగా పెందుర్తి శారదాపీఠాదిపతి స్వరూపానంద స్వామీజీని కూడా ఆశ్రమంలో కలిసి ఆయన దీవెనలు తీసుకున్నారు. మొత్తానికి వైసీపీ, బీజేపీ ముఖ్యమంత్రుల భేటీ ఏంటి అన్నదే అందరిలో ఆసక్తిగా ఉంది మరి.