వీళ్లిద్ధ‌రికీ టీటీడీ బోర్డులో చోటు?

నామినేటెడ్ ప‌ద‌వుల‌పై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ముఖ్యంగా టీటీడీ చైర్మ‌న్‌, బోర్డు స‌భ్యుల‌పై విస్తృత‌మైన ప్ర‌చారం జ‌రుగుతోంది. టీటీడీ చైర్మ‌న్ ఎవ‌ర‌నే విష‌య‌మై ప‌లువురి పేర్లు తెర‌పైకి వ‌చ్చాయి. ఇక బోర్డు స‌భ్యుల…

నామినేటెడ్ ప‌ద‌వుల‌పై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ముఖ్యంగా టీటీడీ చైర్మ‌న్‌, బోర్డు స‌భ్యుల‌పై విస్తృత‌మైన ప్ర‌చారం జ‌రుగుతోంది. టీటీడీ చైర్మ‌న్ ఎవ‌ర‌నే విష‌య‌మై ప‌లువురి పేర్లు తెర‌పైకి వ‌చ్చాయి. ఇక బోర్డు స‌భ్యుల విష‌యానికి వ‌స్తే… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి, అలాగే తిరుప‌తి జిల్లా శ్రీ‌కాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మాజీ జెడ్పీటీసీ స‌భ్యుడు పేరం ధ‌నుంజ‌య‌నాయుడి పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి.

వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డ గ‌తంలో జ‌గ‌న్ స‌ర్కార్ హ‌యాంలో కూడా టీటీడీ స‌భ్యురాలిగా ప‌ని చేశారు. అలాగే టీటీడీ ఢిల్లీ స‌ల‌హామండ‌లి చైర్‌ప‌ర్స‌న్‌గా కూడా ప‌ని చేశారు. ఆ త‌ర్వాత ఎన్నిక‌ల స‌మ‌యంలో మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల్లో వేమిరెడ్డి దంప‌తులు టీడీపీలో చేరారు. వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి నెల్లూరు ఎంపీగా, ప్ర‌శాంతిరెడ్డి కోవూరు ఎమ్మెల్యేగా టీడీపీ త‌ర‌పున గెలుపొందారు. నెల్లూరు జిల్లా రాజ‌కీయాల్లో వేమిరెడ్డి దంప‌తులు క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అందుకే ప్ర‌శాంతికి టీటీడీ బోర్డులో స్థానం ఖ‌రారైంద‌ని టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

తిరుప‌తి జిల్లాకు వెళితే ధ‌నుంజ‌య‌నాయుడికి టీటీడీ బోర్డులో చోటు ఖరైంద‌ని ఆ పార్టీ నేత‌లు చెబుతున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి శ్రీ‌కాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గంలో ధ‌నుంజ‌య‌నాయుడు క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. బొజ్జ‌ల కుటుంబానికి ఆయ‌న విధేయుడిగా వుంటూ వ‌స్తున్నారు. గ‌తంలో బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డికి, ఇప్పుడు ఆయ‌న త‌న‌యుడైన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి ముఖ్య అనుచ‌రుడిగా కొన‌సాగుతున్నారు.

ఇటీవ‌ల మంత్రి నారా లోకేశ్‌ను ధ‌నుంజ‌య‌నాయుడు క‌లుసుకున్నారు. టీటీడీ బోర్డులో అవ‌కాశం ఇస్తామ‌నే హామీని లోకేశ్ నుంచి పొందిన‌ట్టు స‌మాచారం. సుధీర్‌రెడ్డితో పాటు ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలో ఐదారుగురు ఎమ్మెల్యేలు ధ‌నుంజ‌య‌నాయుడికి మ‌ద్ద‌తుగా సిఫార్సు లేఖ‌లు ఇచ్చార‌ని తెలిసింది.

6 Replies to “వీళ్లిద్ధ‌రికీ టీటీడీ బోర్డులో చోటు?”

  1. అగ్ని ప్రమాదాలపై చం ద్రబాబు సర్కా రు నిరాధార ఆరోపణలతో రాద్ధాం తం 

    మదనపల్లిలో ఎలాం టి పత్రాలు దగ్థం కాలేదన్న అధికారులు 

    తిరుపతిలో కాలినవి చిత్తు కాగితాలేనని నిర్ధారణ 

    ధవళేశ్వ రం లోనూ చిత్తు కాగితాలనే కాల్చా రన్న టీడీపీ ఎమ్మెల్యే బుచ్చ య్య 

    అయినాసరే సీఎం చం ద్రబాబు పదేపదే దుష్ప్ర చారం 

    వైఎస్సా ర్సీపీ లక్ష్యం గా సర్కా రు కుతం త్రం 

    సూపర్ సిక్స్ హామీల నుం చి ప్రజల దృ ష్టి మళ్లిం చే పన్నా గం

  2. మోసగాని ..అడగండి ఎప్పడు 2024 మేనిఫెస్ట్ అమలు చేసినాడు అని

    TDP 2024 మెనెఫెస్టో

    మెగా డీఎస్సీపై మొదటి సంతకం

    ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితం

    మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

    దివ్యాంగులకు పింఛను రూ.6 వేలకు పెంపు

    బీసీలకు 50 ఏళ్లకే రూ.4 వేలు పింఛను

    18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500

    1. 99 శాతం మానిఫెస్టో అమలు చేస్తే ఇంట్లో కూర్చోపెట్టారు మనల్ని ..సో వాళ్ళు చేయరు టెన్షన్ పడకు ..

  3. ” ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా యాక్టర్ పృథ్వి “

    ఇదే పృథ్వి ని టీటీడీ విషయం లో ట్రోల్స్ చేసిన టీడీపీ ఈ రోజు ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్ పోస్ట్ ఇచ్చారు అక్కడ ఎనక నుండి వాటేసుకున్న ఎం కాదా? జస్ట్ అడుగుతున్నా నవ్వులాటకి .. ఈ సారి ముందు నుంచి వాటేసుకుంటాడేమో చూడాలి .

Comments are closed.