ఏపీలో హైడ్రా అంటున్న మంత్రి గారి వియ్యంకుడు

ఏపీలో కూడా హైడ్రా వస్తుంది అని అంటున్నారు మంత్రి గారు వియ్యంకుడు. ఆయన టీడీపీలో సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. విశాఖ పర్యటనకు వచ్చిన మునిసిపల్ మంత్రి నారాయణతో కలసి ఆయన…

ఏపీలో కూడా హైడ్రా వస్తుంది అని అంటున్నారు మంత్రి గారు వియ్యంకుడు. ఆయన టీడీపీలో సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. విశాఖ పర్యటనకు వచ్చిన మునిసిపల్ మంత్రి నారాయణతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖలో భూ అక్రమణలు జరిగాయని మంత్రి నారాయణ అన్నారు. పార్కులు సైతం దురాక్రమణలు లోను కావడం బాధాకరం అన్నారు. దీని మీద ఆయన పక్కనే ఉన్న గంటా అందుకుని ఏపీలో కూడా హైడ్రా రావాల్సిందే వస్తుంది అని హింట్ ఇచ్చారు. దీంతో ఏపీలో హైడ్రా అన్న దాని మీద చర్చ మొదలైంది. హైడ్రా తెలంగాణలో రాజకీయ రచ్చ చేస్తోంది.

ఏపీలో హైడ్రా తరహా వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి వస్తుందని మంత్రి నారాయణ కూడా అన్నారు. హైడ్రా ఏర్పాటు వెనక రాజకీయ కక్షలే ఉంటే అది సత్ఫలితాలు ఇవ్వదని అంటున్నారు. కేవలం వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు వెలికి తీయడానికే హైడ్రా లాంటి వ్యవస్థను వాడాలనుకుంటే అది బెడిసి కొడుతుందని అంటున్నారు.

అక్రమార్కులు ఎక్కడ ఉన్నా వెలికి తీసి పట్టుకుని వారిని శిక్షించి వారి అక్రమాలను నేల కూల్చితేనే హైడ్రా అయినా ఏ వ్యవస్థ అయినా ఏర్పాటుకు సార్ధకత చేకూరినట్లు అని అంటున్నారు. విశాఖ విషయానికి వస్తే కేవలం వైసీపీ హయాంలోనే భూ కబ్జాలు జరగలేదు, అంతకు ముందు టీడీపీ హయాంలోనూ జరిగాయి. గత రెండు దశాబ్దాలుగా విశాఖ భూములకు భద్రత లేకుండా పోయింది.

అలాగే రాష్ట్రంలో ఎక్కడ చూసినా అక్రమాలు కనిపిస్తున్నాయి. అందువల్ల టీడీపీ కూటమి హైడ్రా వంటి వ్యవస్థను తేవడం ఎవరైనా స్వాగతించాల్సిందే. కానీ ఆ క్రమంలో దానిని రాజకీయ ప్రత్యర్థుల కోసం వాడుకోకుండా ఉండడం మంచిది అంటున్నారు.

12 Replies to “ఏపీలో హైడ్రా అంటున్న మంత్రి గారి వియ్యంకుడు”

Comments are closed.