జోగయ్యా… ఎంత దిగజారిపోయావయ్యా..!

ఈ మాటలు అన్నది వైసీపీ మంత్రి గుడివాడ అమరనాధ్. మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య జనసేనకు వత్తాసు పలుకుతూ ముఖ్యమంత్రి జగన్ కే లేఖలు రాస్తున్నారు. పవన్ ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే మీకెందుకు అని…

ఈ మాటలు అన్నది వైసీపీ మంత్రి గుడివాడ అమరనాధ్. మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య జనసేనకు వత్తాసు పలుకుతూ ముఖ్యమంత్రి జగన్ కే లేఖలు రాస్తున్నారు. పవన్ ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే మీకెందుకు అని అంటున్నారు. దాంతో ఆయన రాసిన లేఖ వాడుతున్న భాషను చూసిన మంత్రి గుడివాడ జోగయ్యా ఈ వయసులో ఎంత దిగజారిపోయావయ్యా అని చింతిస్తున్నారు.

ఎంతో గొప్ప రాజకీయ జీవితం గడిపిన జోగయ్య ఈ వయసులో ఇలా దిగజారడం చూసి తనకే బాధ వేస్తోందని గుడివాడ అంటున్నారు. పవన్ తో దోస్తీతో ఆయనలో అశ్లీలత పెరుగుతోందని కూడా నిందించారు. పవన్ కళ్యాణ్ పట్ల జోగయ్య ప్రేమ అంతా దృత రాష్ట్ర ప్రేమ అన్నారు. జోగయ్య పవన్ మీద చూపిస్తున్న ప్రేమ వల్ల ఒరిగేది ఏముందని గుడివాడ ప్రశ్నించారు.

పవన్ తో సినిమాలు తీసేవారు అంతా చంద్రబాబు మనుషులే అని గుడివాడ కొత్త మాట చెప్పారు. పవన్ పార్టీ పుట్టిందే చంద్రబాబు కోసమని పవన్ పెరుగుతోంది అంతా ఎల్లో మీడియా కనుసన్నలలోనే అని గుడివాడ పంచులు పేల్చారు. ఈ వాస్తవాలు పెద్దాయన జోగయ్య తెలుసుకుని కూడా ఇలా మాట్లాడడం ఏంటి అని మండిపడ్డారు.

పవన్ మాదిరిగా మీరు కూడా ఒక ప్యాకేజీ స్టార్ కావాలని చూస్తున్నారా అని ప్రశ్నించారు. ఎవరి మీద అయినా వ్యాఖ్యలు చేసే ముందు లేఖలు రాసేందును విచక్షణ ఉండాలి అంటూ పెద్దాయన మీద ఘాటు విమర్శలు చేశారు. మీరు రాస్తున్న‌ లేఖలు అందులో వాడుతున్న భాషను చూస్తే స్వాతీ రెడ్డి అలియాస్ స్వాతీ చౌదరితో పోటీ పడుతున్నారు అని సెటైర్లు పెల్చారు.

జోగయ్య లెటర్ ప్యాడ్ చూస్తే మాజీ హోం మంత్రి అని ఉంటుంది. ఆయన లోక్ సభ మాజీ మెంబర్. ఎన్నో పదవులు నిర్వహించారు. ఈ రోజున ఆయన జనసేన అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు అన్న విమర్శలు మూటగట్టుకుంటున్నారు అంటున్నారు. జోగయ్య కాపుల కోసం మేలైన పని చేస్తూ అన్ని రాజకీయ పార్టీలకూ న్యూట్రల్ గా ఉండాల్సిన వారు అని అంటున్నారు. ఆయన పవన్ కోసం పని చేస్తే తప్పు లేదు కానీ జగన్ మీద అనరాని మాటలు అంటూ లేఖలు రాయడం పట్ల వైసీపీ నేతలు మండిపడుతున్నారు.