భార్య వల్ల నిర్మాతకు తలనొప్పులు

బాలీవుడ్ లో ప్రస్తుతం హాట్ హాట్ గా నడుస్తున్న వివాదం ఏదైనా ఉందంటే అది జిగ్రా వివాదం మాత్రమే. నటి-నిర్మాత-దర్శకురాలు దివ్య ఖోస్లా కుమార్, జిగ్రా సినిమాపై బహిరంగంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.…

బాలీవుడ్ లో ప్రస్తుతం హాట్ హాట్ గా నడుస్తున్న వివాదం ఏదైనా ఉందంటే అది జిగ్రా వివాదం మాత్రమే. నటి-నిర్మాత-దర్శకురాలు దివ్య ఖోస్లా కుమార్, జిగ్రా సినిమాపై బహిరంగంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

విడుదల రోజు తను చాలా ఖాళీ థియేటర్లు చూశానంటూ, ఫొటో కూడా పోస్ట్ పెట్టారు దివ్య. మేకర్స్ కావాలనే జిగ్రా కలెక్షన్లను పెంచి చూపిస్తున్నారని, కార్పొరేట్ బుకింగ్స్ ద్వారా బాలీవుడ్ పరువు తీస్తున్నారని ఆమె ఆరోపించారు.

దీనిపై కరణ్ జోహార్ సీరియస్ అయ్యాడు. “మూర్ఖులకు ఇచ్చే ఉత్తమ సమాధానం మౌనమే” అంటూ ట్వీట్ చేశాడు. దీంతో దివ్య మరింత సీరియస్ అయింది. తనలాంటి వ్యక్తిపైనే ఇంత వివక్ష చూపిస్తే, బయట అమ్మాయిలు బాలీవుడ్ లోకి ఎందుకొస్తారంటూ ఫైర్ అయింది.

ఇప్పుడీ మొత్తం వ్యవహారం యానిమల్ పార్క్ పై ప్రభావం చూపించేలా ఉంది. దివ్య ఖోస్లా కుమార్ కు యానిమల్ పార్క్ కు లింక్ ఉంది.

బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్టయింది యానిమల్ సినిమా. సందీప్ రెడ్డి వంగ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో రణబీర్ కపూర్ హీరోగా నటించాడు. అతడి కెరీర్ బెస్ట్ మూవీగా యానిమల్ నిలిచింది. ఈ సినిమాకు భూషణ్ కుమార్ నిర్మాత. జిగ్రా సినిమాపై ఆరోపణలు చేస్తున్న దివ్యకు స్వయానా భర్త ఇతడు. ఇక జిగ్రా సినిమాలో హీరోయిన్ ఎవరనే సంగతి తెలిసిందే. స్వయానా రణబీర్ కపూర్ భార్య అలియా భట్.

అంటే.. హీరో భార్యపై, నిర్మాత భార్య ఆరోపణలు చేస్తోంది. ఫేక్ టికెట్ బుకింగ్స్ చేస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తోంది. ఇలా భార్యలు కొట్టుకుంటుంటే.. సదరు హీరో, నిర్మాత కలిసి యానిమల్ కు కొనసాగింపుగా మరో సినిమా చేయగలరా అనే అనుమానాలు మొదలయ్యాయి.

అయితే యానిమల్ పార్క్ సెట్స్ పైకి రావడానికి ఇంకా టైమ్ ఉంది. సందీప్ రెడ్డి ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ మూవీ చేసేందుకు ప్రీ-ప్రొడక్షన్ లో బిజీగా ఉన్నాడు. కాబట్టి యానిమల్ పార్క్ సెట్స్ పైకి వచ్చేసరికి అన్నీ సర్దుకుంటాయని భావిస్తున్నారు.

One Reply to “భార్య వల్ల నిర్మాతకు తలనొప్పులు”

Comments are closed.