టాలీవుడ్ నిర్మాత ఇంట విషాదం!

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస‌ర్, పీపుల్ మీడియా అధినేత టీజీ విశ్వప్రసాద్‌ తల్లి గీతాంజలి (70) ఇవాళ‌ తుది శ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా కొంత కాలంగా ఆమె బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స…

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస‌ర్, పీపుల్ మీడియా అధినేత టీజీ విశ్వప్రసాద్‌ తల్లి గీతాంజలి (70) ఇవాళ‌ తుది శ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా కొంత కాలంగా ఆమె బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

కోలుకోలేనని తెలిసి ఆమె తనను వారణాసికి తీసుకెళ్లాలని కుమారుడిని కోరారు. ఈ క్రమంలో ఆమె చివరి కోరిక తీర్చేందుకు విశ్వప్రసాద్.. ఆమెను వారణాసికి తీసుకువెళ్ళారు. అక్కడ దైవ దర్శనం చేసుకున్న తర్వాత ఆమె తుది శ్వాస విడిచిన‌ట్లు తెలుస్తోంది. వారణాసిలోనే ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి.

గీతాంజలికి ముగ్గురు పిల్లలు కాగా విశ్వ ప్రసాద్ పెద్ద కుమారుడు. విశ్వ ప్ర‌సాద్ ‘ఎం.ఎల్.ఏ’ చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఇప్పటికే ధమాకా, కార్తికేయ 2 లాంటి హిట్ చిత్రాలు నిర్మించారు.  ఇటీవల రిలీజ్ అయిన ఆదిపురుష్ ను తెలుగులో ఈ బ్యానర్స్ లోనే రిలీజ్ చేశారు. మరోపక్క పవన్ కళ్యాణ్ తో ‘బ్రో’ అనే సినిమా, శర్వానంద్ తో కూడా ఓ సినిమాను నిర్మిస్తున్నారు.