పూరి..చార్మి..పైడిపల్లి…జెజిఎమ్

అంతా రెడీ అవుతోంది. మైహోమ్ సంస్థ స్వంత బ్యానర్ శ్రీకర స్టూడియోస్ తరపున దర్శకుడు వంశీ పైడిపల్లి, పూరి కనెక్ట్ తరపున చార్మి కౌర్ కలిసి కొత్త సినిమా కు శ్రీకారం చుట్టారు. దర్శకుడు…

అంతా రెడీ అవుతోంది. మైహోమ్ సంస్థ స్వంత బ్యానర్ శ్రీకర స్టూడియోస్ తరపున దర్శకుడు వంశీ పైడిపల్లి, పూరి కనెక్ట్ తరపున చార్మి కౌర్ కలిసి కొత్త సినిమా కు శ్రీకారం చుట్టారు. దర్శకుడు పూరి జ‌గన్నాధ్ కలల ప్రాజెక్ట్ జ‌నగణమన..(జెజిఎమ్) ను ఈ రోజు ప్రకటించారు. 

ఈ సినిమా షూటింగ్ కొన్ని నెలల తరువాత ప్రారంభం అవుతుంది. వచ్చే ఏడాది ఆగస్టు 3న విడుదల. అది కూడా ఇప్పుడే ప్రకటించారు. దేశ భక్తి, ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో సినిమా అని విడుదల చేసిన పోస్టర్లు స్పష్టం చేస్తున్నారు. 

అసలు ఈ కథను మహేష్ కోసం తయారు చేసింది. కానీ ఆఖరికి ఇప్పుడు సెట్ మీదకు వెళ్లడానికి ఫిక్స్ అయింది. విజ‌య్ దేవరకొండను హీరోగా తీసుకున్నారు. ఈ సినిమాను భారీ పాన్ ఇండియా సినిమాగా నిర్మించనున్నారు.

హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో నిర్మిస్తారు. ఇది అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ అని దర్శకుడు పూరి జ‌గన్నాధ్ పేర్కొన్నారు. నిర్మాతల్లో ఒకరైన వంశీ పైడిపల్లి మాట్లాడుతూ శ్రీకర స్టూడియోస్ భాగస్వామ్యంలో నిర్మాణమయ్యే ఈ సినిమా ప్రతి ఒక్కరిని అలరించేలా వుంటుందని అన్నారు.