రవితేజ-శ్రీలీల..మళ్లీ మరోసారి

ధమాకా జోడీ మళ్లీ రిపీట్ అవుతోంది. రవితేజ-శ్రీలీల మళ్లీ మరోసారి కలిసి నటిస్తున్నారు.  Advertisement మైత్రీ మూవీస్ లో వీరసింహారెడ్డి లాంటి హిట్ సినిమా అందించిన దర్శకుడు గోపీచంద్ మలినేని ఓ సినిమాను రవితేజ…

ధమాకా జోడీ మళ్లీ రిపీట్ అవుతోంది. రవితేజ-శ్రీలీల మళ్లీ మరోసారి కలిసి నటిస్తున్నారు. 

మైత్రీ మూవీస్ లో వీరసింహారెడ్డి లాంటి హిట్ సినిమా అందించిన దర్శకుడు గోపీచంద్ మలినేని ఓ సినిమాను రవితేజ తో చేయబోతున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. ఈ సినిమాకు శ్రీలీలను హీరోయిన్ గా ఫిక్స్ చేసుకున్నారు.

అంటే ఈ సినిమా అంతా రిపీట్ రిపీట్ అన్నమాట. క్రాక్ తరువాత గోపీచంద్-రవితేజ, వీరసింహారెడ్డి తరువాత గోపీ-మైత్రీ… అమర్ అక్బర్ తరువాత మైత్రీ-రవితేజ, ఇలా అన్ని విధాలా హిట్ కాంబినేషన్లు అన్నమాట. ఒక్క అమర్..అక్బర్ తప్పిస్తే.. అన్నీ హిట్ లే.

ఇప్పుడు బలమైన కథతో మైత్రీ కి ఆ లోటు తీర్చాలని గోపీచంద్ మలినేని ముందుకు వచ్చారు. ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నుంచి ఈ సినిమా సెట్ మీదకు వెళ్తుంది. మళ్లీ దాదాపుగా క్రాక్, వీరసింహారెడ్డి టెక్నికల్ టీమ్ నే దీనికీ పని చేస్తుంది.