రీ సెన్సార్ కు ‘హిడింబ’

యాంకర్ ఓంకార్ సోదరుడు అశ్విన్ హీరోగా, నందిత శ్వేత హీరోయిన్ గా తయారైన సినిమా హిడింబ. గతంలో మిస్టర్ నోకియా, రన్ లాంటి సినిమాలు తీసిన అనిల్ కన్నెగంటి దర్శకుడు. ఈ సినిమా మేకింగ్…

యాంకర్ ఓంకార్ సోదరుడు అశ్విన్ హీరోగా, నందిత శ్వేత హీరోయిన్ గా తయారైన సినిమా హిడింబ. గతంలో మిస్టర్ నోకియా, రన్ లాంటి సినిమాలు తీసిన అనిల్ కన్నెగంటి దర్శకుడు. ఈ సినిమా మేకింగ్ పూర్తయి తరువాత, దాని నెగిటివ్ రైట్స్ కొనుక్కుని, నిర్మాత అనిల్ సుంకర విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ట్రయిలర్ ఇటీవలే విడుదలయింది. ఈ నెల 23న విడుదలకు కూడా సన్నాహాలు చేసారు. కానీ ఇప్పుడు వాయిదా పడినట్లే. ఎందుకంటే..ఈ సినిమాకు సెన్సారు విషయంలో సమస్యలు వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ సినిమా ట్రయిలర్ ఇటీవల విడుదలైంది. కాస్త హింస పాలు ఎక్కువే వుంది అన్న ఫీల్ కలిగించింది. అయితే బిజినెస్ పరంగా అదే ట్రయిలర్ బాగా హెల్ప్ చేసింది నిర్మాతకు. కానీ ఇప్పుడు సమస్య  ఏమిటంటే సెన్సారు వారు సర్టిఫికెట్ కు నిరాకరించారో, లేదా సెన్సారు కు నిరాకరించారో అని తెలుస్తోంది. దాంతో ఇప్పుడు రీ సెన్సారు కు దరఖాస్తు చేసినట్ల తెలుస్తోంది.

సినిమాలో అశ్లీలం, సెక్స్ లాంటివి లేవు కానీ, కాస్త హింస పాలు వుంది అని ట్రయిలర్ చెప్పకనే చెబుతోంది. పైగా ట్రయిలర్ లో ఓ ప్రత్యేక మైన తెగ గురించి కూడా ప్రస్తావన వుంది. ఈ తెగకు వున్న ఓ అలవాటు అన్నది సినిమాలో కీలక పాయింట్. దాని మీద కూడా సెన్సారు అభ్యంతరం వచ్చినట్లు తెలుస్తోంది.

రీసెన్సారు అంటే ప్రాసెస్ చాలా వుంటుంది. వాటిని దాటి సినిమాకు కొత్త డేట్ ఇవ్వాల్సి వుంటుంది.