పోస్టర్ రిలీజ్ చేసిన నిర్మాత.. స్పందించని హీరో

స్పై సినిమా నిర్మాత కె. రాజశేఖర్ రెడ్డి, హీరో నిఖిల్ మధ్య విడుదల తేదీకి సంబంధించిన పంచాయితీ నడుస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 29న విడుదల చేద్దామనేది నిర్మాత వాదన. అలా చేస్తే ప్రచారానికి…

స్పై సినిమా నిర్మాత కె. రాజశేఖర్ రెడ్డి, హీరో నిఖిల్ మధ్య విడుదల తేదీకి సంబంధించిన పంచాయితీ నడుస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 29న విడుదల చేద్దామనేది నిర్మాత వాదన. అలా చేస్తే ప్రచారానికి టైమ్ సరిపోదనేది నిఖిల్ వాదన.

కార్తికేయ-2తో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు నిఖిల్. అందుకే స్పై సినిమాకు దేశవ్యాప్తంగా కీలకమైన ప్రాంతాల్లో ప్రమోషన్ చేయాలనేది అతడి ఆలోచన. 29న రిలీజ్ పెట్టుకుంటే అలా చేయడం కుదరదు. పైగా డబ్బింగ్, కాస్త షూటింగ్ పెండింగ్ ఉన్నాయి. ఇవి కంప్లీట్ చేసి, దేశవ్యాప్తంగా ప్రమోట్ చేయడం కష్టమని, అందుకే సినిమాను వాయిదా వేద్దామని కోరాడు నిఖిల్.

దీనికి నిర్మాత అంగీకరించలేదు. ఆల్రెడీ సినిమా బిజినెస్ పూర్తయిందని, డేట్ వాయిదా వేస్తే నష్టాలు వస్తాయని నిర్మాత చెబుతున్నాడు. పైగా బక్రిద్ టైమ్ లో సినిమా రిలీజ్ చేస్తే, మంచి వసూళ్లు వస్తాయని, సినిమాకు ప్లస్ అవుతుందని చెబుతున్నాడు.

ఓవైపు ఇలా వాదోపవాదనలు జరుగుతుండగానే, సినిమాకు సంబంధించి ఓ లిరికల్ వీడియో విడుదల చేశాడు నిర్మాత. దీంతో నిఖిల్ హర్ట్ అయ్యాడు. కనీసం ఆ వీడియోను అతడు తన సోషల్ మీడియా హ్యాండిల్ లో షేర్ కూడా చేయలేదు. దీంతో వివాదం మరింత ముదిరింది.

అయితే ఈ విషయంలో నిర్మాతే పైచేయి సాధించినట్టు కనిపిస్తోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్ లాంఛ్ చేశారు. ఇంతకుముందు చెప్పిన జూన్ 29 తేదీకే స్పై సినిమా వస్తుందని ప్రకటిస్తూ, కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో ఈ సినిమా విడుదలపై ఉన్న సస్పెన్స్ వీడింది.

రీసెంట్ గా స్పై సినిమాకు సంబంధించి పెండింగ్ షూట్ తో పాటు డబ్బింగ్ పూర్తిచేశాడట నిఖిల్. అలా తనవైపు నుంచి సినిమా విడుదలకు పూర్తి సహకారం అందించాడు. అయితే ఇంత షార్ట్ టైమ్ లో రిలీజ్ చేయడం నిఖిల్ కు ఇష్టం లేనట్టు కనిపిస్తోంది. ఎందుకంటే, అతడు రిలీజ్ డేట్ పోస్టర్ ను కూడా తన ట్విట్టర్ హ్యాండిల్ లో ఇప్పటివరకు షేర్ చేయలేదు.