ప్రియుడితో కలిసి పుకార్లకు చెక్ పెట్టిన హీరోయిన్

తను ప్రేమలో ఉన్నానని, నిర్మాత జాకీ భగ్నానీతో డేటింగ్ చేస్తున్నానంటూ కరోనా టైమ్ లోనే ప్రకటించింది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. అయితే ఆ తర్వాత మళ్లీ ఆమె, తన ప్రియుడితో కనిపించలేదు. దీంతో…

తను ప్రేమలో ఉన్నానని, నిర్మాత జాకీ భగ్నానీతో డేటింగ్ చేస్తున్నానంటూ కరోనా టైమ్ లోనే ప్రకటించింది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. అయితే ఆ తర్వాత మళ్లీ ఆమె, తన ప్రియుడితో కనిపించలేదు. దీంతో ఆమె డేటింగ్ పై పుకార్లు మరోసారి గుప్పుమన్నాయి.

తనపై వస్తున్న పుకార్లపై కూడా ఆమధ్య స్పందించింది రకుల్. తమ వ్యక్తిగత విషయాల కంటే, సినిమాలపై దృష్టి పెట్టాలంటూ మీడియాపై కాస్త అసహనం వ్యక్తం చేసింది. తామిద్దరం బాగానే ఉన్నామని, బయటకొచ్చి ఫొటోలకు పోజులివ్వాల్సిన అవసరం లేదంటూ చిరాకు పడింది.

అయితే రకుల్ ప్రకటనతో ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి. జాకీతో ఆమె ఎఫైర్ బ్రేకప్ అయిందని, అందుకే ఆమె ఎక్కడా తన ప్రియుడితో కనిపించడం లేదంటూ కత్త కథనాలు మొదలయ్యాయి. ఎట్టకేలకు వీటికి తన చేతలతో సమాధానం ఇచ్చింది రకుల్ ప్రీత్.

ముంబయిలో తాజాగా జరిగిన ఓ పెళ్లి వేడుకకు ప్రియుడితో కలిసి హాజరైంది రకుల్. అంతేకాదు, జాకీ చేతిలో చేయి వేసి మరీ ఫొటోగ్రాఫర్లకు పోజులిచ్చింది. తామిద్దరం కలిసే ఉన్నామని, తమ ప్రేమ వ్యవహారం సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోందంటూ ఇలా పరోక్షంగా క్లారిటీ ఇచ్చింది రకుల్.

ప్రస్తుతం ఈ బ్యూటీ హిందీ-తమిళ సినిమాలతో బిజీగా ఉంది. టాలీవుడ్ నుంచి ఆమెకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. రీసెంట్ గా వచ్చిన ఓ స్పెషల్ సాంగ్ ఆఫర్ ను ఆమె రిజెక్ట్ చేసింది.