త్రివిక్రమ్ ఆ పనిలో ఫుల్ బిజీ

అయ్యప్పన్ కోషియమ్ కథను పవన్ ఫ్యాన్స్ అభిరుచికి అనుగుణంగా మార్చడంలో ఫుల్ సక్సెస్ అయ్యారు దర్శకుడు త్రివిక్రమ్. ఇప్పుడు మళ్లీ మరోసారి అదే పని పెట్టుకున్నారు.   Advertisement తమిళ సినిమా వినోధ్య సిథం ను…

అయ్యప్పన్ కోషియమ్ కథను పవన్ ఫ్యాన్స్ అభిరుచికి అనుగుణంగా మార్చడంలో ఫుల్ సక్సెస్ అయ్యారు దర్శకుడు త్రివిక్రమ్. ఇప్పుడు మళ్లీ మరోసారి అదే పని పెట్టుకున్నారు.  

తమిళ సినిమా వినోధ్య సిథం ను పవర్ ఫ్యాన్స్ కు నచ్చేలా తయారు చేయడంలో బిజీగా వున్నారని బోగట్టా. ఈ సినిమాను సెట్ చేసింది ఆయనే. పీపుల్స్ మీడియా నిర్మాణంలో, సముద్ర ఖని డైరక్షన్ లో తయారయ్యే ఈ సినిమాలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ది కీలక పాత్ర. 

అయితే ఒరిజినల్ లో యువకుడి పాత్ర కాదు. కానీ ఇప్పుడు ఈ పాత్రను సాయి ధరమ్ తేజ్ కు అనుకూలంగా మార్చడం, పాటలు, ఫైట్లు వంటి కమర్షియల్ పాయింట్లు యాడ్ చేయడం లాంటి వ్యవహారాలు తలెకెత్తుకున్నారు.

హీరో మహేష్ బాబు ఇప్పట్లో ఎలాగూ సెట్ కువచ్చేలా లేరు. కనీసం మూడు, నాలుగు నెలలు టైమ్ పడుతుంది. మహేష్ కు ఫుల్ నెరేషన్ ఇవ్వాల్సి వుంది. దానికి ఇంకా టైమ్ వుంది. అందుకే ఈ గ్యాప్ లో వినోద్య సిథం సినిమా మీద త్రివిక్రమ్ ఫుల్ బిజీగా వున్నట్లు తెలుస్తోంది.