ఛైతూకి ఆ ఇద్దరూ ఫిక్స్

విక్రమ్ కే కుమార్ డైరక్షన్ లో దిల్ రాజు నిర్మించే నాగ్ చైతన్య థాంక్యూ సినిమాలో రష్మిక, లేదా పూజా హెగ్డే కోసం ట్రయ్ చేస్తున్న సంగతి తెలిసిందే.  Advertisement ఈ ప్రయత్నం ఇలా…

విక్రమ్ కే కుమార్ డైరక్షన్ లో దిల్ రాజు నిర్మించే నాగ్ చైతన్య థాంక్యూ సినిమాలో రష్మిక, లేదా పూజా హెగ్డే కోసం ట్రయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. 

ఈ ప్రయత్నం ఇలా వుండగానే మరో ఇద్దరు హీరోయిన్లను ఫిక్స్ చేసారని తెలుస్తోంది. అవికా గౌర్, మాళవిక నాయర్ లను ఇద్దరు హీరోలుగా ఫిక్స్ చేసారు.

వీరు కాక ఓ మెయిన్ హీరోయిన్ కావాల్సివుంది. ఆ క్యారెక్టర్ కోసం పూజ లేదా రష్మిక లను ట్రయ్ చేస్తున్నారు. కీర్తి సురేష్ ను అడిగారని,కానీ ఆమె నో అన్నదని తెలుస్తోంది. ముగ్గురు హీరోయిన్ల సినిమాలో చేయడం ఇష్టం లేకనే నో అన్నట్లు బోగట్టా. 

విక్రమ్ కుమార్ థాంక్యూ కథ కొంత వరకు ప్రేమమ్, ఆటోగ్రాఫ్ సినిమాల మాదిరిగా వుంటుంది. ఒక్కో స్టేజ్ లో ఒక్కో హీరోయిన్ పరిచయం వుంటుంది. అందుకే ముగ్గురు హీరోయిన్లు వుంటారు కానీ, మెయిన్ హీరోయిన్ ఒక్కరే.ఆ ఒక్కరి కోసమే వేట ఇంకా బాకీ వుంది.

వ్రతం చెడినా, ఫలితమైనా దక్కుతుందా?

దర్శకుడిగా మారుతున్న రవితేజ