రామ్-బోయ..ఛలో మైసూరు

రామ్ పోతినేని-బోయపాటి సినిమా షూట్ ఓ కొలిక్కి వచ్చింది. సినిమా ఆఖరి షెడ్యూలు రేపటి నుంచి ఈ నెల 15 వరకు మైసూరులో జరగబోతోంది.  Advertisement ఈ షెడ్యూలులో ఓ ఫైట్, ఓ పాట…

రామ్ పోతినేని-బోయపాటి సినిమా షూట్ ఓ కొలిక్కి వచ్చింది. సినిమా ఆఖరి షెడ్యూలు రేపటి నుంచి ఈ నెల 15 వరకు మైసూరులో జరగబోతోంది. 

ఈ షెడ్యూలులో ఓ ఫైట్, ఓ పాట చిత్రీకరిస్తారు. ఆ తరువాత హైదరాబాద్ లో ఓ పాట చిత్రీకరిస్తే సినిమా షూట్ మొత్తం ముగిసిపోతుంది. ఈ పాట కోసం హైదరాబాద్ లో సెట్ రెడీగా వుంది. అంటే టోటల్ షూట్ వర్క్ ఈ నెలాఖరు లోపే పూర్తయిపోతుంది. జూలై నెలాఖరుతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ముగిసిపోతుందన్నమాట.

అయితే విడుదల తేదీ సంగతి తేలాల్సి వుంది. ఆగస్టులో భోళాశంకర్ వుంది. సెప్టెంబర్ లో టిల్లు స్క్వేర్ అనౌన్న్ చేసారు. అందువల్ల ఏ డేట్ ఫిక్స్ అవుతుంది అన్నది చూడాల్సి వుంది. ఈ రెండింటికి మధ్యలో ఏదైనా డేట్ ఫిక్స్ అయ్యే అవకాశం వుంది. చిట్టూరి శ్రీను నిర్మిస్తున్న ఈ సినిమా మీద మంచి అంచనాలు వున్నాయి.

అఖండ తరువాత బోయపాటి సినిమా ఇది. పైగా రామ్ తో బోయపాటి తొలి సినిమా ఇది. అందువల్ల ఈ సినిమా మీద మాంచి ఆసక్తి వుంది. ఇస్మార్ట్ శంకర్ తరువాత రామ్ కు సరైన హిట్ పడలేదు. ఈ సినిమా తరువాత రామ్ మళ్లీ ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ చేయబోతున్నాడు.